కరాచీలో ఓ అభిమాని ఉన్నాడు: వినోద్‌ కాంబ్లి

భారత్‌-పాక్‌ ఆటగాళ్లు మైదానంలో ఎంత పోటాపోటీగా తలపడినా మైదానం బయట మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ...

Published : 19 Jul 2020 11:14 IST

అతనెప్పుడూ పాక్‌ క్రికెటర్‌తో లేఖలు పంపేవాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాక్‌ ఆటగాళ్లు మైదానంలో ఎంత పోటాపోటీగా తలపడినా మైదాన బయట మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లమని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ అన్నాడు. ‘గ్రేటెస్ట్‌ రైవల్రీ పాడ్‌కాస్ట్‌’లో మాట్లాడిన అతడు పాకిస్థాన్‌ జట్టులో కూడా తనకు మిత్రులు ఉన్నారని చెప్పాడు. అలాగే కరాచీలో తనకు ఓ వీరాభిమాని ఉన్నాడని చెప్పాడు. 1991లో టీమ్‌ఇండియాలో చేరిన నాటి నుంచీ ఆ అభిమాని తనను అనుసరిస్తున్నాడని వెల్లడించాడు. ఈ క్రమంలోనే భారత జట్టు పాక్‌ పర్యటనకు వెళ్లినప్పుడల్లా మంచి ఆతిథ్యం లభించేదన్నాడు. 

‘మొబైల్‌ ఫోన్లు లేని ఆ కాలంలో లేఖలు పంపేవాడు. తన భావాలను వాటిలోనే వ్యక్తపరిచేవాడు. పాక్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడల్లా రషీద్‌ లతీఫ్‌తో వాటిని నాకు అందజేసేవాడు. ఆ అభిమాని పాక్‌ క్రికెటర్‌ వద్దకెళ్లి నాకు ఆ లేఖలు ఇవ్వమని చెప్పేవాడు. అలా అవి నా వరకు చేరేవి. ఇప్పటికీ పాకిస్థాన్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది’ అని కాంబ్లీ వివరించాడు. అలాగే తనకు వకార్‌ యూనిస్‌, వసీం అక్రమ్‌తో పాటు మిగతా ఆటగాళ్లతో స్నేహం ఉందన్నాడు. అది ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని