ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర..
ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తొలి రెండు వన్డేలు ఘోరంగా ఓటమిపాలయ్యేసరికి అంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని విమర్శించారు. కానీ, అదే కోహ్లీ ఇప్పుడు రెండు గొప్ప ఘనతలు సాధించి...
టీ20 క్రికెట్లో ‘పది’లమైన విజయాలు..
ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తొలి రెండు వన్డేలు ఘోరంగా ఓటమిపాలయ్యేసరికి అంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని విమర్శించారు. కానీ, అదే కోహ్లీ ఇప్పుడు రెండు గొప్ప ఘనతలు సాధించి అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. 2018-19 సీజన్లో కంగారూల గడ్డపై వన్డే, టెస్టు సిరీస్ గెలుపొందిన విరాట్.. అప్పుడు మిగిలిపోయిన టీ20 సిరీస్ను ఇప్పుడు కైవసం చేసుకున్నాడు. దీంతో దిగ్గజ ఆటగాడు, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి వీలుకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఏడాది కాలంగా పొట్టి క్రికెట్లో భారత్కు ఓటమే ఎరుగకుండా వరుసగా పది విజయాలు అందించాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా గెలవడంతోనే ఈ రెండు ఘనతలు దక్కాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ సాధించిన విజయాలేంటో గుర్తుచేసుకుందాం..
వెస్టిండీస్తో మొదలై..
గతేడాది డిసెంబర్లో టీమ్ఇండియా.. వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్ ఆడింది. అప్పుడు తొలి పోరులో భారత్ గెలవగా రెండో మ్యాచ్లో కరీబియన్లు గెలిచారు. ఇక మూడో టీ20లో కోహ్లీసేన 67 పరుగులతో విజయం సాధించి జైత్రయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 240/3 భారీ స్కోర్ సాధించింది. రోహిత్(71), రాహుల్(91), విరాట్ కోహ్లీ (70) రెచ్చిపోయి ఆడారు. అనంతరం విండీస్ 173/8కే పరిమితమై సిరీస్ కోల్పోయింది. ఆపై జనవరిలో శ్రీలంకతో మరో మూడు టీ20ల సిరీస్ ఆడగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో కోహ్లీసేనే విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లోనూ భారత్ 201/6 మరోసారి భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన లంకేయులు 123 పరుగులకే ఆలౌటయ్యారు. దాంతో భారత్ వరుసగా 3 టీ20 మ్యాచ్లు గెలుపొందింది.
న్యూజిలాండ్లోనే అసలు మజా..
అదే జనవరిలో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన భారత్ అక్కడ పొట్టి క్రికెట్లో విశేషంగా రాణించింది. 5-0తేడాతో కివీస్ను వైట్వాష్ చేసి న్యూజిలాండ్ గడ్డపై పొట్టి సిరీస్ గెలుపొందింది. మరీ ముఖ్యంగా రెండు మ్యాచ్ల గురించి చెప్పుకోవాలి ఇక్కడ. మూడో మ్యాచ్లో ఇరు జట్లు 179 పరుగులు చేయగా, నాలుగో మ్యాచ్లో 165 పరుగులు చేశాయి. దీంతో ఆ రెండూ సూపర్ ఓవర్లకు వెళ్లాయి. కోహ్లీసేన ఆ రెండింటిలో విజయం సాధించి చివరి మ్యాచ్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 163/3 స్కోర్ సాధించగా, న్యూజిలాండ్ 156/9కే పరిమితమైంది. దీంతో భారత్ అప్పటివరకు వరుసగా 8 పొట్టి మ్యాచ్ల్లో విజయం సాధించింది.
ఆస్ట్రేలియాలో తడబడుతూనే..
న్యూజిలాండ్ పర్యటన తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా లాక్డౌన్, ఆపై ఐపీఎల్ ఆడిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా విమానం ఎక్కారు. ఈ నేపథ్యంలోనే సిడ్నీలో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమవ్వగా తర్వాత కాన్బెరాలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించారు. దాంతో కాస్త ఊరట లభించింది. అదే ఆత్మవిశ్వాసంతో తొలి టీ20లో 11 పరుగులతో విజయం సాధించిన కోహ్లీసేన ఆదివారం రెండో మ్యాచ్లో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో ఏడాది కాలంగా భారత్ టీ20 క్రికెట్లో ఓటమే ఎరుగకుండా పయనిస్తోంది. ఇక మంగళవారం జరిగే మూడో టీ20లోనూ విజయం సాధిస్తే కోహ్లీసేన ఇంకో రికార్డు నెలకొల్పుతుంది. అదేంటంటే.. పొట్టి క్రికెట్లో వరుసగా 11 మ్యాచ్లు గెలుపొందిన అఫ్గానిస్థాన్తో సమానంగా నిలుస్తుంది. ఈ పసికూన జట్టు 2018-19 సీజన్లో ఓటమి రుచిచూడకుండా వరుసగా 12 మ్యాచ్లు గెలుపొందింది. 2016-17లో కూడా వరుసగా 11 మ్యాచ్ల్లో గెలిచి ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన మూడో టీ20 గెలిస్తే.. అఫ్గాన్తో సమానంగా రెండో స్థానంలో నిలుస్తుంది.
-ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
లెక్క సరి
రసెల్ కన్నా పాండ్య ఉత్తమం: భజ్జీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్