టాప్లో కోహ్లీ: తర్వాత ధోనీ, రోహిత్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలుకొట్టడం కొత్తేమి కాదు. బరిలోకి దిగితే రికార్డుల మోత గ్యారెంటీ. అయితే అతడు తాజాగా ఓ ఘనత సాధించాడు. కానీ అది మైదానంలో కాదు, సామాజిక మాధ్యమంలో.
ఇంటర్నెట్డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రికార్డులు బద్దలుకొట్టడం కొత్తేమి కాదు. బరిలోకి దిగితే రికార్డుల మోత గ్యారెంటీ. అయితే అతడు తాజాగా ఓ ఘనత సాధించాడు. కానీ అది మైదానంలో కాదు, సామాజిక మాధ్యమంలో. ఈ ఏడాది భారత క్రీడాకారులందరిలో అతడి గురించే ఎక్కువ మంది ట్విటర్ వేదికగా ప్రస్తావించారని ‘ట్విటర్ ఇండియా’ తెలిపింది. అతడి తర్వాతి స్థానాల్లో మాజీ సారథి ఎంఎస్ ధోనీ, ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నారు. ఇక మహిళా అథ్లెట్లలో రెజ్లర్ గీతా ఫొగాట్ టాప్లో ఉండగా షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఇటీవల కోహ్లీ ట్విటర్లో మరో రికార్డు సాధించిన విషయం తెలిసిందే. తండ్రి కాబోతున్నానని అతడు చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైక్లు పొందిన ట్వీట్గా నిలిచింది.
అయితే ట్విటర్లో ధోనీ మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది ఎక్కువమంది చేసిన రీట్వీట్ ధోనీదే. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు మహీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. క్రికెట్కు ధోనీ వీడ్కోలు పలకడం 130 కోట్ల మంది భారతీయులను నిరాశకు గురిచేసిందని, గడ్డు పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడిన అతడు యువతకు ఆదర్శంగా నిలిచాడని మోదీ ట్వీట్ చేశారు. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ధోనీ బదులిచ్చాడు. కాగా, ఆ ట్వీట్ ఈ ఏడాది రీట్వీట్ల్లో టాప్గా నిలిచింది.
ఇక ట్విటర్లో ఈ ఏడాది క్రీడలకు సంబంధించిన హ్యాష్టాగ్స్లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలిచింది. మహమ్మారి కారణంగా ఈ ఏడాది లీగ్ ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన 13వ సీజన్లో ముంబయి ట్రోఫీని అందుకుంది. అయితే హ్యాష్టాగ్స్ ట్రెండింగ్లో ఐపీఎల్ తర్వాతి స్థానాల్లో విజిల్పోడు, టీమ్ఇండియా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మద్దతు ఇస్తూ అభిమానులు విజిల్పోడు పదాన్ని ఉపయోగిస్తుంటారు. కాగా, ట్విటర్లో ఈ ఏడాది విదేశీ క్రీడాకారులందరిలో ఎక్కువగా ప్రస్తావించిన జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (ఫుట్బాల్ ఆటగాడు), డేవిడ్ వార్నర్ (ఆసీస్ క్రికెటర్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక విదేశీ జట్ల గురించి.. ఫుట్బాల్కు సంబంధిచిన మాంచెస్టర్ యునైటెడ్, ఎఫ్సీ బార్సిలోనా, అర్సెనల్ టాప్లో ఉన్నాయని ట్విటర్ ఇండియా వెల్లడించింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.