కోహ్లీలేనంత మాత్రాన కప్పు గెలిచినట్టు కాదు
రాబోయే టెస్టు సిరీస్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ మినహా మిగతావి ఆడనంత మాత్రాన తాము కప్పు గెలిచినట్టు కాదని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అన్నాడు...
టీమ్ఇండియాతో టెస్టు సిరీస్పై నాథన్ లయన్
ఇంటర్నెట్డెస్క్: రాబోయే టెస్టు సిరీస్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ మినహా మిగతావి ఆడనంత మాత్రాన తాము కప్పు గెలిచినట్టు కాదని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఆడకపోతే సిరీస్ నిరుత్సాహంగా ఉంటుందని చెప్పాడు. యూఏఈలో టీ20 లీగ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు గురువారం నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. అక్కడ జట్టు 14 రోజుల క్వారంటైన్ అనంతరం 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీ తొలి టెస్టు పూర్తయ్యాక భారత్కు తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి అనుష్కశర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుండటంతో విరాట్ పితృత్వపు సెలవులు తీసుకున్నాడు.
‘కోహ్లీ ఆడకపోవడం విచారకరం. ఎవరైనా మేటి క్రికెటర్లతోనే ఆడాలనుకుంటారు. స్టీవ్స్మిత్, మార్నస్ లబుషేన్లతో పాటు అతడిని కూడా అత్యత్తమ క్రికెటర్గానే భావిస్తా. కోహ్లీ లేకపోవడం నిరుత్సాహపరిచే విషయమే అయినా భారత జట్టులో అనేక మంది సూపర్స్టార్లున్నారు. పుజారా, రహానెతో పాటు పలువురు యువ ప్రతిభావంతులు బరిలోకి దిగే అవకాశముంది. దాంతో మా ముందు పెద్ద సవాలే ఉంది. విరాట్ లేనంతమాత్రాన మేం కప్పును దక్కించుకున్నట్లు కాదు. చేయాల్సింది చాలా ఉంది’ అని లయన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!