విరాట్లో నచ్చే లక్షణం అదే: సైని
సారథి విరాట్ కోహ్లీ తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని టీమ్ఇండియా యువ పేసర్ నవదీప్ సైని అన్నాడు. అభిప్రాయాలు పంచుకున్నందుకు అభినందిస్తాడని పేర్కొన్నాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని వెల్లడించాడు....
ఇంటర్నెట్ డెస్క్: సారథి విరాట్ కోహ్లీ తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని టీమ్ఇండియా యువ పేసర్ నవదీప్ సైని తెలిపాడు. అభిప్రాయాలు పంచుకున్నందుకు అభినందిస్తాడని పేర్కొన్నాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని వెల్లడించాడు.
అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టిన సైనికి కోహ్లీ ఉదారంగా జట్టులో చోటిచ్చాడు. అతడిలో ఆత్మవిశ్వాసం నింపాడు. అందుకు తగ్గట్టే ఈ యువ పేసర్ రాణించాడు. త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతడు మళ్లీ కోహ్లీ సారథ్యంలోనే ఆడనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.
‘విరాట్ భాయ్ శ్రద్ధగా ఆలకిస్తాడు. మొదట బౌలర్లు జట్టు ప్రణాళికకు అనుగుణంగా బంతులు వేయాలని భావిస్తాడు. ఆ వ్యూహం పనిచేయకపోతే వారి అభిప్రాయాలను తీసుకుంటాడు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే బౌలర్లను ఆయన అభినందిస్తాడు. అలా చేయడం ద్వారా ఆ బౌలర్ ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలో అవగాహన ఉంటుంది’ అని సైని అన్నాడు. ‘బౌలర్ అభిప్రాయం చెప్పాక సందేహం ఉంటే కోహ్లీ భాయ్ సలహాలు ఇస్తాడు. మార్పులు సూచిస్తాడు. బౌలర్ నుంచీ స్పందన కోరుకుంటాడు. ప్రతి దానికి తల ఊపాలని కోరుకోడు’ అని అతడు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.