విరాట్‌లో నచ్చే లక్షణం అదే: సైని

సారథి విరాట్‌ కోహ్లీ తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. అభిప్రాయాలు పంచుకున్నందుకు అభినందిస్తాడని పేర్కొన్నాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని వెల్లడించాడు....

Published : 02 Aug 2020 00:53 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: సారథి విరాట్‌ కోహ్లీ తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ నవదీప్‌ సైని తెలిపాడు. అభిప్రాయాలు పంచుకున్నందుకు అభినందిస్తాడని పేర్కొన్నాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని వెల్లడించాడు.

అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టిన సైనికి కోహ్లీ ఉదారంగా జట్టులో చోటిచ్చాడు. అతడిలో ఆత్మవిశ్వాసం నింపాడు. అందుకు తగ్గట్టే ఈ యువ పేసర్‌ రాణించాడు. త్వరలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడు మళ్లీ కోహ్లీ సారథ్యంలోనే ఆడనున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.

‘విరాట్‌ భాయ్‌ శ్రద్ధగా ఆలకిస్తాడు. మొదట బౌలర్లు జట్టు ప్రణాళికకు అనుగుణంగా బంతులు వేయాలని భావిస్తాడు. ఆ వ్యూహం పనిచేయకపోతే వారి అభిప్రాయాలను తీసుకుంటాడు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే బౌలర్లను ఆయన అభినందిస్తాడు. అలా చేయడం ద్వారా ఆ బౌలర్‌ ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలో అవగాహన ఉంటుంది’ అని సైని అన్నాడు. ‘బౌలర్‌ అభిప్రాయం చెప్పాక సందేహం ఉంటే కోహ్లీ భాయ్‌ సలహాలు ఇస్తాడు. మార్పులు సూచిస్తాడు. బౌలర్‌ నుంచీ స్పందన కోరుకుంటాడు. ప్రతి దానికి తల ఊపాలని కోరుకోడు’ అని అతడు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని