ముందు ఆస్ట్రేలియా సంగతి చూసుకో : జాఫర్
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ను ట్రోల్చేశాడు. తొలుత హాగ్ ట్వీట్ చేస్తూ భారత టాప్ఆర్డర్ను విమర్శించాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ను ట్రోల్చేశాడు. తొలుత హాగ్ ట్వీట్ చేస్తూ భారత టాప్ఆర్డర్ను విమర్శించాడు. ‘టీమ్ఇండియా టాప్ఆర్డర్ ఆఫ్స్టంప్ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి. అలాగే ఆఫ్స్టంప్నకు దూరంగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు’ అని దెప్పిపొడిచే విధంగా పేర్కొన్నాడు. శుక్రవారం ‘ఆస్ట్రేలియా ఎ’ తో ప్రారంభమైన రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చూసి ఇలా వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన జాఫర్ అంతే దీటుగా బదులిచ్చాడు.
ఆస్ట్రేలియా ముందు తమ టాప్ఆర్డర్ ఎవరో తెలుసుకోవాలని చురక అంటించాడు. మరో నాలుగు రోజుల్లో టీమ్ఇండియాతో ప్రారంభమయ్యే తొలి టెస్టులో తమ ఓపెనర్లుగా ఎవరు దిగనున్నారనే విషయంపై ఆస్ట్రేలియాకే స్పష్టత లేదని తనదైన శైలిలో రీట్వీట్ చేశాడు. కాగా, ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా ఇప్పటికే తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు యువ బ్యాట్స్మన్ విల్ పుకోవిస్కీ సైతం ఇటీవల తొలి ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కంకషన్కు గురయ్యాడు. తాజాగా మరో ఆటగాడు కూడా ఆ జట్టులో గాయం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలోనే కంగారూలు శనివారం తమ జట్టులోకి మార్కస్ హారిస్ను తీసుకున్నారు. దీంతో జోబర్న్స్తో కలిసి అతడు తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఏదేమైనా డిసెంబర్ 17న అడిలైడ్లో తొలి టెస్టు ప్రారంభమయ్యే సమయానికే ఆస్ట్రేలియా తరఫున ఎవరు ఓపెనింగ్ చేస్తారనే విషయం తెలుస్తుంది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!