జడేజా.. నిన్ను సూపర్ అనేది ఇందుకే!
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి సెషన్లో ఓ అద్భుత క్యాచ్ అందుకొని...
మెల్బోర్న్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి సెషన్లో ఓ అద్భుత క్యాచ్ అందుకొని అభిమానుల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ జో బర్న్స్(0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ మాథ్యూవేడ్(30; 39 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. అశ్విన్ వేసిన 12.5 ఓవర్కు అతడు షాట్ ఆడడంతో బంతి గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన జడేజా ఆ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అదే సమయంలో శుభ్మన్ గిల్ సైతం క్యాచ్ పట్టడానికి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు ఢీకొట్టుకున్నప్పటికీ.. అప్పటికే జడ్డూ ఆ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో కంగారూల జట్టు రెండో వికెట్ కోల్పోయింది. గిల్ పరుగెత్తుకు వచ్చి బలంగా తాకినా ఈ మేటి ఆల్రౌండర్ బంతిని వదలకుండా అలాగే పట్టుకున్నాడు. ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్సైట్ ట్విటర్లో పంచుకోవడంతో అది చూసిన అభిమానులు జడ్డూను ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి..
స్టీవ్స్మిత్ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి
కాంస్యమే.. కొండంత బలాన్నిచ్చింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..