ఆసీస్ను భయపెడతాం: కోహ్లీ
బలంగా పుంజుకుని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను భయపెట్టేలా టెస్టు సిరీస్కు సిద్ధమవుతామని భారత సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో...
ఇంటర్నెట్డెస్క్: బలంగా పుంజుకుని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను భయపెట్టేలా టెస్టు సిరీస్కు సిద్ధమవుతామని భారత సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కోహ్లీ (85; 60 బంతుల్లో, 4×4, 3×6) పోరాడాడు. అయితే చివరి టీ20లో ఓడినప్పటికీ భారత్ మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు.
‘‘హార్దిక్ పాండ్య భారీ షాట్లు మొదలుపెట్టడంతో లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించాం. అయితే మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ మ్యాచ్ను దూరం చేశాయి. మధ్య ఓవర్లలో 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే హార్దిక్కు సులువుగా ఉండేది. తిరిగి బలంగా పుంజుకుని టెస్టు సిరీస్లో ఆసీస్ను భయపెట్టడానికి మార్గాలు అన్వేషిస్తాం. అయితే ఈ ఏడాదిని మరింత గొప్పగా ముగించడానికి టీ20 సిరీస్ విజయం దోహదపడుతుంది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. భారత్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సంజు శాంసన్ (10), శ్రేయస్ అయ్యర్ (0) ఔటవ్వడంతో టీమిండియా స్కోరువేగం నెమ్మదించింది.
‘‘ఇదే పోటీతత్వాన్ని టెస్టుల్లో కూడా కొనసాగిస్తాం. ఆసీస్లో ఆడిన అనుభవం మాకు ఉంది. పరుగులు సాధిస్తాం. భారీ స్కోరు సాధించాలంటే ప్రతి సెషన్కు ప్రణాళికతో ఆడాలి. గతంలో పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత టీమ్ ఎంతో బలంగా ఉంది. అయితే సన్నాహక మ్యాచ్లో నేను ఆడటం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపు నిద్ర లేచిన తర్వాత ఆడాలా వద్దా అని ఆలోచిస్తా. మా ఫిజియోతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటా’’ అని కోహ్లీ తెలిపాడు. డిసెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగే సన్నాహక మ్యాచ్లో టీమిండియా గులాబీ బంతితో ఆడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న భారత్ నాలుగు టెస్టుల సిరీస్లో.. తొలి టెస్టు డే/నైట్ కావడంతో గులాబి బంతి సన్నాహక మ్యాచ్ ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది. కాగా, పితృత్వ సెలవులతో కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్