ఆఖరి 4 ఓవర్లు.. ఆకాశమే హద్దు
ఆఖరి నాలుగు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాలని నిర్ణయించుకున్నామని ముంబయి ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ (47*; 20 బంతుల్లో 3×4, 4×6) అన్నాడు. యువ ఆటగాడు హార్దిక్ పాండ్య (30*; 11 బంతుల్లో 3×4, 2×6) జోరు మీద కనిపించాడని పేర్కొన్నాడు. గత మ్యాచ్ ఓడిపోవడంతో గెలవాలన్న...
హార్దిక్ స్వింగ్లో కనిపించాడన్న పొలార్డ్
అబుదాబి: ఆఖరి నాలుగు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాలని నిర్ణయించుకున్నామని ముంబయి ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ (47*; 20 బంతుల్లో 3×4, 4×6) అన్నాడు. యువ ఆటగాడు హార్దిక్ పాండ్య (30*; 11 బంతుల్లో 3×4, 2×6) జోరు మీద కనిపించాడని పేర్కొన్నాడు. గత మ్యాచ్ ఓడిపోవడంతో గెలవాలన్న కసితో ఆడామని వివరించాడు. పంజాబ్పై ఘన విజయం తర్వాత అతడు మాట్లాడాడు.
అబుదాబి వేదికగా గురువారం రాత్రి ముంబయి, పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రాహుల్ ముంబయిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే పరుగుల ఖాతా తెరవకముందే ఆ జట్టు డికాక్ (0; 5 బంతుల్లో) వికెట్ చేజార్చుకుంది. సూర్యకుమార్(10; 7 బంతుల్లో) సైతం త్వరగా రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (70; 45 బంతుల్లో 7×4, 3×6), ఇషాన్ కిషన్ (28; 32 బంతుల్లో 1×4, 1×6) నెమ్మదిగా ఆడారు. దాంతో 14 ఓవర్లకు ముంబయి 87/3తో నిలిచింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్, పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఆఖరి 4 ఓవర్లలో 89 పరుగులు సాధించారు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఆఖరి ఓవర్లోనైతే ఏకంగా 25 పరుగులు చేసి పంజాబ్కు 192 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. బదులుగా రాహుల్ సేన 143/8కే పరిమితమైంది.
‘గెలిచినందుకు సంతోషంగా ఉంది. గత మ్యాచులో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచులో విజయం వైపు ఉండాలని కోరుకున్నాం. మన ముందు ఎవరున్నారన్నదే ముఖ్యం. బౌలర్లను చూసి ఎన్ని పరుగులు రాబట్టాలో నిర్ణయించుకోవాలి. ఓవర్లో 15 పరుగులు కావాలంటే బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు హార్దిక్ జోరుమీద కనిపించాడు. అతడి బ్యాటు స్వింగ్ సైతం చాలా బాగుంది. ఆఖరి నాలుగు ఓవర్లలో మేం ఆకాశమే హద్దుగా చెలరేగాలని అనుకున్నాం. ఇప్పుడైతే విజయం లభించింది కానీ మున్ముందు కీలక మ్యాచులు ఆడాల్సి ఉంది’ అని పొలార్డ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.