కోహ్లీసేన.. పొట్టి క్రికెట్టైనా గెలుస్తారా!
మూడు వన్డేల సిరీస్ను 1-2 చేజార్చుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఆఖరి వన్డేలో గెలిచిన మనుక ఓవల్లోనే మొదటి టీ20లో తలపడనుంది. తొలి పోరులోనే విజయం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని గట్టి...
శుక్రవారం ఆసీస్తో తొలి టీ20 పోరు
యువకుల రాకతో టీమ్ఇండియా జోరు
కాన్బెర్రా: మూడు వన్డేల సిరీస్ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఆఖరి వన్డేలో గెలిచిన మనుక ఓవల్లోనే మొదటి టీ20లో తలపడనుంది. తొలి పోరులోనే విజయం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. వన్డేల్లో అనేక విభాగాల్లో ఇబ్బందులు పడటంతో టీమ్ఇండియా కూర్పు కుదర్లేదు. ప్రస్తుతం యువకుల రాక.. ఆల్రౌండర్లు అందుబాటులో ఉండటంతో 20 ఓవర్ల ఫార్మాట్లో పటిష్ఠంగానే కనిపిస్తోంది. ఆసీస్పై గత రెండు టీ20 సిరీసులు గెలవలేకపోయిన కోహ్లీసేన ఈసారైనా సత్తా చాటేనా!
నట్టూ అరంగేట్రం!
కరోనా మహమ్మారికి ముందు కివీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమ్ఇండియా 5-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ఆసీస్తో పొట్టి క్రికెట్ సిరీసులో తలపడుతోంది. యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నటరాజన్ రాకతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. కంగారూలతో ఆఖరి వన్డేలో నట్టూ కొన్ని పరుగులు ఎక్కువే ఇచ్చినా తనదైన యార్కర్లతో సత్తా చాటాడు. అతడి టీ20 అరంగేట్రం ఖాయమే అనిపిస్తోంది. ఇక ఐపీఎల్లో పవర్ప్లే, మధ్య ఓవర్లలో సుందర్ను కోహ్లీ వ్యూహాత్మకంగా వాడుకున్నాడు. బ్యాటింగ్తోనూ అతడు జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇది జట్టుకు లాభించేదే. బ్యాటుతో పరుగుల వరద పారిస్తున్న హార్దిక్ పాండ్య పరిమిత స్పెల్తో ఆకట్టుకోగలడు! ఇక జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షమి, దీపక్లో ఎవరు కొత్త బంతిని పంచుకుంటారో చూడాలి. మనుక ఓవల్ స్పిన్నర్లకూ సహకరిస్తుండటంతో పుంజుకోవాలని యుజ్వేంద్ర చాహల్ పట్టుదలగా ఉన్నాడు.
ఓపెనర్గా రాహుల్
బ్యాటింగ్ పరంగా టీమ్ఇండియా ఫర్వాలేదనిపిస్తోంది. వికెట్కీపర్ కేఎల్ రాహుల్.. ధావన్తో కలిసి తనకిష్టమైన ఓపెనింగ్లో రావొచ్చు. ఐపీఎల్ తరహాలో వీలైతే 20 ఓవర్లూ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు. అతడు ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ సైతం నాలుగో స్థానంలో రాణిస్తే తిరుగుండదు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా బ్యాటు, బంతితో కీలకంగా మారే అవకాశముంది. ఇక మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే, సంజు శాంసన్లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.
వార్నర్ లేకపోవడం లోటే
ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే, టీ20లకు ఒకే జట్టు ప్రకటించింది. వారిలో కొందరు గాయాల పాలైనప్పటికీ తొలి టీ20లో భారత్ను ఓడించాలనే దృఢనిశ్చయంతో మిగిలినవారు ఉన్నారు. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లేకపోవడం పెద్ద లోటే. ఫామ్లో ఉన్న ఆరోన్ ఫించ్తో మార్నస్ లబుషేన్ ఓపెనింగ్ చేయొచ్చు. బిగ్బాష్లో ఓపెనర్గా మెరుపులు మెరిపించిన స్టాయినిస్ సైతం అందుబాటులోనే ఉన్నాడు. అయితే అతడికి చిన్న గాయంకావడంతో ఆడటం అనుమానమే. ఆఖరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న మిచెల్ స్టార్క్ రావడంతో ఆసీస్బౌలింగ్ మరింత పటిష్టం కానుంది. ఇక స్టీవ్స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ వీరోచిత ఫామ్లో ఉండటం టీమ్ఇండియాకు నష్టం కలిగించే అంశమే. వికెట్కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ కేరీ సైతం ప్రమాదకరమే.
అప్పుడేం జరిగిందంటే
టీ20ల్లో ఆస్ట్రేలియాపై టీమ్ఇండియాకు మెరుగైన రికార్డే ఉంది. ఈరెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 11-8 తేడాతో భారత్దే పైచేయి. విజయాల శాతం 57.89. అయితే ఈ సిరీసుకు ముందు జరిగిన రెండు సిరీసుల్లోనూ కోహ్లీసేనకు మంచి ఫలితాలు రాలేదు. 2019 ఫిబ్రవరిలో ఉపఖండంలో ఆసీస్ పర్యటించింది. రెండు మ్యాచులు ఆడితే రెండూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. దానికి ముందు ఆసీస్లో పర్యటించిన టీమ్ఇండియా 3 టీ20ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. ఇక శుక్రవారం మ్యాచ్ జరిగే మనుక ఓవల్ బౌలర్లు, బ్యాటర్లకు అనుకూలించనుంది.
జట్లు ఇవే
భారత్: విరాట్ కోహ్లీ (కె), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (వి), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, దీపక్ చాహర్, నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కె), సీన్ అబాట్, ఆస్టన్ ఏగర్, అలెక్స్ కేరీ (వి), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, మోజెస్ హెన్రిక్స్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, డేనియెల్ సామ్స్, రిచర్డ్సన్, స్టీవ్స్మిత్, మిచెల్ స్టార్క్, స్టాయినిస్, మాథ్యూవేడ్, డీఆర్సీ షార్ట్, ఆడమ్ జంపా
ఇవీ చదవండి
బుమ్రా ఇలా అయ్యాడేంటి?
శార్దూల్.. ఏంటీ ఆవేశం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?