రైనా మళ్లీ భారత్కు ఆడే అవకాశం ఉందా?
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా లేదన్నాడు బ్రాడ్హాగ్...
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్హాగ్ ఏమన్నాడో చూడండి
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా లేదన్నాడు బ్రాడ్హాగ్. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆటకు సంబంధించిన అనేక విషయాలపై స్పందించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఒకరు రైనా గురించి ప్రశ్నించడంతో అతడిలా అన్నాడు.
టీమ్ఇండియాలో ప్రస్తుత పరిస్థితుల్లో సారథి విరాట్ కోహ్లీ యువకులపైనే ఆసక్తి చూపుతున్నాడని, రైనా ఆడే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే మంచి ప్రదర్శన చేశాడని చెప్పాడు. అంతకన్నా కింద స్థాయిలో రైనా ఆడటం తాను చూడలేనని.. 3,4 స్థానాల్లో సరిగ్గా సరిపోయే బ్యాట్స్మన్ అని కీర్తించాడు. ఇకపై టీమ్ఇండియాలో అతడిని చూడలేమన్నాడు. కాగా, రైనాకున్న ఒకే ఒక్క అవకాశం టీ20ల్లో శిఖర్ ధావన్ను వదిలేసి రాహుల్, రోహిత్తో ఓపెనింగ్ చేయనిస్తే అప్పుడు మాత్రం చిన్న అవకాశం ఉందన్నాడు. అయితే, తాను మాత్రం అతడిని మళ్లీ టీమ్ఇండియాలో చూస్తాననుకోవట్లేదని స్పష్టంచేశాడు.
ఇదే వీడియోలో అంతకుముందే ఒక అభిమాని ధోనీ గురించి అడిగాడు. బ్యాటింగ్, కీపింగ్ విషయాల్లో ఎవరైనా మాజీ సారథిని రీప్లేస్ చేయగలరా అని ప్రశ్నించగా బ్రాడ్ ఇలా స్పందించాడు. ధోనీ అద్భుతమైన ఆటగాడని, భయం లేకుండా ఆడతాడని చెప్పాడు. ఒత్తిడినంతా తనపైనే వేసుకొని ఆడతాడని తెలిపాడు. చాలా సార్లు తామే విజయం సాధిస్తామనే నమ్మకంతో ఆడతాడని వివరించాడు. కాగా, ధోనీ ఏడాదిగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో సెమీస్ ఆడిన అతడు తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఇక మార్చిలో చెన్నైలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొని ఈసారి ఐపీఎల్కు సన్నద్ధమయ్యాడు. లాక్డౌన్తో మెగా టోర్నీ వాయిదా పడడంతో రాంచీలోని ఫామ్హౌజ్కు పరిమితమయ్యాడు. తాజాగా ఐపీఎల్పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఆగస్టులో అందరి కన్నా ముందే చెన్నైసూపర్ కింగ్స్ యూఏఈకి వెళ్లనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!