రోహిత్ వచ్చేశాడు! మరి జట్టులో మార్పులేంటి?
బాక్సింగ్ డే టెస్టు విజయంతో సిరీస్లో టీమిండియా తిరిగి రేసులోకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్ను 1-1తో ఆసీస్ ఆధిక్యాన్ని సమం చేసింది. మూడో టెస్టులోనూ సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ఆసీస్పై పైచేయి...
ఇంటర్నెట్డెస్క్: బాక్సింగ్ డే టెస్టు విజయంతో సిరీస్లో టీమిండియా తిరిగి రేసులోకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్ను 1-1తో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని సమం చేసింది. మూడో టెస్టులోనూ సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ఆసీస్పై ఆధిక్యం సాధించాలని రహానెసేన భావిస్తోంది. అయితే క్వారంటైన్ను ముగించుకుని స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ బుధవారం జట్టులో చేరాడు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టులో మార్పులు ఖాయమే అనిపిస్తోంది. కాగా, అతడు ఎవరి స్థానంలో జట్టులోకి వస్తాడనేదే అందరి ప్రశ్న!
సుదీర్ఘ ఫార్మాట్లో గొప్ప రికార్డులేమి లేని రోహిత్.. గతేడాది స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్లో ఓపెనర్ అవతారమెత్తాడు. శతకాలు సాధించి అన్ని ఫార్మాట్లలో సత్తాచాటగలనని చాటిచెప్పాడు. అయితే అతడు అసలు పరీక్షను ఎదుర్కోలేదు. గాయంతో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో గాయంతో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపిక కాలేదు. ఫిట్నెస్ను నిరూపించుకుని టెస్టు సిరీస్ కోసం ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారిలో ఒకరిని బెంచ్కు పరిమితం చేసి హిట్మ్యాన్కు స్థానం కల్పిస్తారనే వాదనలు వస్తున్నాయి. అంతేగాక ఆటకు చాలా రోజులు దూరమైన అతడు ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తాడని అంటున్నారు.
ఇదే విషయమై రెండో టెస్టు విజయానంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ..‘‘రోహిత్తో చర్చించిన తర్వాత అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది స్పష్టత వస్తుంది. ఎందుకంటే అతడు గత కొన్ని వారాలుగా క్వారంటైన్లోనే ఉన్నాడు’’ అని అన్నాడు. అయితే ఓపెనర్గా రోహిత్ వస్తే మయాంక్ బెంచ్కే పరిమితమవుతాడు. అరంగేట్రంలోనే శుభ్మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో అతడి స్థానం ఖరారైనట్లే. ఒకవేళ అయిదో స్థానంలో రోహిత్తో ఆడించాలనకుంటే విహారికి నిరాశ తప్పదు.
టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా రోహిత్ జట్టులోకి వస్తే మయాంక్/విహారిలో ఒకరు తుదిట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే మయాంక్ ఎంతో ప్రతిభావంతుడని, గతంలో అతడు శతకాలు, డబుల్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్లు ఆడాడని గుర్తుచేశాడు. క్వారంటైన్ నుంచి వచ్చిన రోహిత్ ఓపెనర్గా బరిలోకి దిగడని భావించాడు. కాగా, హిట్మ్యాన్ ఏ స్థానంలో ఆడతాడనేది జట్టు యాజమాన్యం ఆలోచనపై ఆధారపడి ఉంటుందని ఎమ్మెస్కే అన్నాడు. మరోవైపు.. మయాంక్, విహారి ఇద్దరినీ బెంచ్కు పరిమితం చేసి, కేఎల్ రాహుల్, రోహిత్ను తుదిజట్టులోకి తీసుకోవాలని మాజీ సెలక్టర్ దిలీప్ వెంగసర్కార్ సూచించాడు. సూపర్ఫామ్లో ఉన్న రాహుల్ తొలి రెండు టెస్టులకు ఎంపిక కాని విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా జనవరి 7నుంచి భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?