నీ ప్రయాణం అజరామరం..
టీమ్ఇండియా ఆల్టైమ్ ఆల్రౌండర్గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్గా యువరాజ్సింగ్ ప్రతీ ఒక్క క్రికెట్ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత...
యువీ బర్త్డే స్పెషల్ ఫొటో ఫీచర్
టీమ్ఇండియా ఆల్టైమ్ ఆల్రౌండర్గా, రెండు ప్రపంచకప్ల ఛాంపియన్గా యువరాజ్సింగ్ ప్రతీ ఒక్క క్రికెట్ అభిమానికీ సుపరిచితమే. 19 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించిన అతడు సుదీర్ఘకాలం భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెరీర్ తొలినాళ్లలో నాట్వెస్ట్ సిరీస్ మొదలు కొని 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్తో పాటు పలు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఇంగ్లాండ్లో చివరిసారి ప్రపంచకప్ ఆడి ఆటకు వీడ్కోలు పలుకుదామని భావించిన అతడికి జట్టులో అవకాశం రాకపోవడంతో అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు యువీ 39వ జన్మదినం జరుపుకొంటున్న సందర్భంగా అతడికి సంబంధించిన పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం..
గేట్వే ఆఫ్ ఇండియా వద్ద..
2011 ఏప్రిల్ 2న ముంబయిలోని వాంఖడేలో టీమ్ఇండియా ప్రపంచకప్ ఫైనల్స్లో శ్రీలంకపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయానికి గుర్తుగా మరుసటి రోజు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ప్రపంచకప్తో యువీ.
2003 ప్రపంచకప్ ఫైనల్స్లో..
జోహెనస్బర్గ్లో జరిగిన నాటి ప్రపంచకప్ ఫైనల్స్లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆరోజు బ్రాడ్హాగ్ బౌలింగ్లో యువీ బౌండరీ బాదిన దృశ్యమిది.
ఆరు సిక్సుల్లో ఐదో సిక్స్ ఇది..
2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో యువీ ఆరు సిక్సులు బాదిన సంగతి తెలిసిందే. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ చుక్కలు చూపించాడు. ఆ సందర్భంలో తీసిన ఐదో సిక్సర్ చిత్రమిది.
పాకిస్థాన్పై గెలిచాక కెప్టెన్ కూల్తో..
2007 టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా పాకిస్థాన్పై విజయం సాధించాక కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న అరుదైన జ్ఞాపకం.
ఇదో విజయానందం..
2011 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియాపై విజయానంతరం. ఈ మ్యాచ్లో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసి 260/6 స్కోర్ చేయగా, భారత్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో యువీ(57*), సురేశ్ రైనా(34*)తో కలిసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సందర్భం.
క్యాన్సర్ను జయించాక ఇలా..
2011 ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ తర్వాత అమెరికాకు వెళ్లి మెరుగైన శస్త్రచికిత్స పొందాడు. అక్కడి నుంచి భారత్కు తిరిగి వచ్చాక పూర్తిగా కోలుకున్నాడు. అదే సమయంలో 2012 ఐపీఎల్లో పుణె వారియర్స్ ఆటగాళ్లతో కలిసిన సందర్భంగా తీసిన చిత్రం.
విరాట్ కోహ్లీతో కలిసివస్తూ..
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దక్షిణాఫ్రికాపై విజయం సాధించాక నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి వస్తున్న చిత్రమిది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్ 38 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ(76), యువరాజ్(23) నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన వేళ.
-ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
ఇప్పుడైనా ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?
కోహ్లీ లేకపోతే భారత్కు అంత నష్టమా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.