కోహ్లీకి చాహల్ పంచింగ్ కామెంట్
ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ఇప్పటికే అన్ని ప్రధాన జట్లూ యూఏఈకి చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కూడా శుక్రవారం అక్కడికి వెళ్లింది...
(ఫొటోలు: ఆర్సీబీ ట్విటర్ నుంచి)
దుబాయ్: ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ఇప్పటికే అన్ని ప్రధాన జట్లూ యూఏఈకి చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కూడా శుక్రవారం అక్కడికి వెళ్లింది. ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో బయలు దేరిన ఫొటోలను ఆ జట్టు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే, అందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ కనిపించలేదంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు. అలాగే కోహ్లీ వ్యక్తిగతంగా ఒక్కడే వెళ్లాడేమో అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. చివరికి బెంగుళూరు కెప్టెన్ దుబాయ్లో జట్టు ఉంటున్న హోటల్ నుంచే ఒక ఫొటో తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ‘హలో దుబాయ్’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
దీనికి స్పందించిన సహచర ఆటగాడు యుజువేంద్ర చాహల్ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ‘హలో మేం కూడా ఇదే హోటల్ నుంచి. మీ పక్కనుండే వాళ్లం’ అంటూ చమత్కరించాడు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం ఆర్సీబీకి చెందిన దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్ కూడా జట్టుతో కలిసిపోయారు. వారు నేరుగా తమ దేశం నుంచే దుబాయ్కు వచ్చారు. ఆ వీడియోను కూడా ఆర్సీబీ ట్విటర్లో పోస్టుచేసింది. అలాగే బెంగుళూరు నుంచి దుబాయ్కి చేరుకున్న విమాన ప్రయాణాన్ని కూడా అభిమానులతో పంచుకుంది. ఇక ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచీ ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. దీంతో ఈసారైనా అది నెరవేరాలని ఆ జట్టుతో పాటు బెంగుళూరు అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్