కాబోయే సతీమణితో చాహల్ అదిరిపోయే వీడియో..
టీమ్ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ గురువారం ఓ అదిరిపోయే వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తనకు కాబోయే సతీమణి ధనశ్రీతో కలిసి...
నీ ఇన్స్టాగ్రామ్ రిపోర్ట్ చేస్తా.. క్రిస్గేల్ వార్నింగ్
(ఫొటో: చాహల్ ట్విటర్)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ గురువారం ఓ అదిరిపోయే వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తనకు కాబోయే సతీమణి ధనశ్రీతో కలిసి ఓ పాటను అనుకరించిన అతడు దాన్ని ఇన్స్టాలో పోస్టు చేశాడు. కాబోయే దంపతులిద్దరూ అందులో అదరగొట్టారు. తమ నటనతో ఆ పాటకు తగ్గ హావభావాలు పలికించి నెటిజన్లను ఫిదా చేశారు. ఆ వీడియో చూసిన విండీస్ బ్యాట్స్మన్, యూనివర్స్ బాస్ క్రిస్గేల్ మరోసారి ఆర్సీబీ స్పిన్నర్కు వార్నింగ్ ఇచ్చాడు. ‘చాహల్ ఇప్పటికే చాలా చేశావు. నేనిప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ను రిపోర్ట్ చేస్తున్నా’ నంటూ హెచ్చరించాడు. అయితే, ఇలా సరదాకే కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గేల్ ఆ కామెంట్లో నవ్వుతున్న ఎమోజీలు జతచేశాడు.
అంతకుముందు లాక్డౌన్ సమయంలోనూ ఈ విధ్వంసక వీరుడు చాహల్ను ఇలాగే హెచ్చరించాడు. అప్పుడు టీమ్ఇండియా స్పిన్నర్ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. నిత్యం ఏదో ఒక వీడయోతో అలరించేవాడు. టిక్టాక్లో తన ఫన్నీ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందాడు. అలాగే ఏ క్రికెటర్ అయినా ఆన్లైన్లో కనిపిస్తే చాలు చటుక్కున వాళ్ల మధ్య దూరిపోయి సరదా జోక్లతో కవ్వించేవాడు. ఈ క్రమంలోనే అతడి వీడియోలు చూసి క్రిస్గేల్, రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు అతడిపై కామెంట్లు చేశారు. ఇక లాక్డౌన్ అనంతరం ధనశ్రీతో నిశ్చితార్ధం చేసుకున్న యుజీ.. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని. అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఆపై ఐపీఎల్ ఆడేందుకు ఆర్సీబీతో కలిసి దుబాయ్కు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మెగా ఈవెంట్ కోసం సన్నద్ధమౌతున్నాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తనకు కాబోయే భాగస్వామితో దిగిన ఫొటోలనునెటిజన్లను అలరిస్తున్నాడు. ఇక గురువారం ఏకంగా ఒక వీడియోను విడుదల చేసి అందరినీ మైమరపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.