Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
యో-యో టెస్టు(Yo-Yo Test)పై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్లు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించాడు.
ఇంటర్నెట్డెస్క్ : ఆటగాళ్ల ఫిట్నెస్కు ప్రాధాన్యతనిస్తూ.. ‘యో-యో’ టెస్టు(Yo-Yo Test)ను ఇటీవల బీసీసీఐ(BCCI) తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎంపిక ప్రక్రియలో డెక్సా(Dexa)(బోన్ స్కాన్ టెస్టు)ను తప్పని సరి చేసింది. అయితే ఈ పరీక్షలపై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) మరోసారి విమర్శలు గుప్పించాడు. తాము క్రికెట్ ఆడే సమయంలో యో-యోను తప్పనిసరి చేసి ఉంటే.. చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు టీమ్ఇండియాలో భాగమయ్యేవారు కాదని పేర్కొన్నాడు.
‘యో-యో టెస్టులో విఫలమైతే.. టీమ్లో మీకు చోటు దక్కదు. మా సమయంలో ఇలాంటి పరీక్షలు పెట్టి ఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిల్ అయ్యేవాళ్లు. దీంతో వారు టీమ్ఇండియాకు దూరమయ్యేవారు’ అంటూ సెహ్వాగ్ ఓ ఛానల్తో మాట్లాడుతూ అన్నాడు.
‘మేం క్రికెట్ ఆడే సమయంలో.. నైపుణ్యాలపైనే దృష్టి ఉండేది. మ్యాచ్లను ఎవరు గెలిపిస్తారు..?ఎవరు బాగా రాణిస్తారు లేదా ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? ఇలాంటి విషయాలపైనే దృష్టి ఉండేది. మీకు బాగా పరుగెత్తే వారు కావాలంటే.. వారిని మారథాన్లలో నడిపించండి. వారు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని నేను నమ్ముతాను’ అంటూ సెహ్వాగ్ వివరించాడు.
ఆటగాళ్లంతా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని.. జిమ్లలో వెయిట్లిఫ్టింగ్లపై కాదని సెహ్వాగ్ సూచించాడు. జిమ్లలో చేసే కసరత్తులతో గాయాలబారిన పడే అవకాశముందని చెప్పాడు. ‘మా సమయంలో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏదైనా.. ప్రాక్టీస్ చేయడం, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి ఉండేది. కెరీర్ను ఉత్తమంగా తీర్చిదిద్దుకునేందుకు జిమ్ ముఖ్యమైనదే.. అయితే అది ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటుంది. మీ శరీరం సహకరిస్తే చేయండి. మీకు ఇతర సమస్యలుంటే.. జిమ్కు పరిమితులు విధించండి. నైపుణ్యాలే ఇక్కడ ముఖ్యం’ అంటూ సెహ్వాగ్ తన అభిప్రాయాలను తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.