IPL 2022 : ఐపీఎల్ 15వ సీజన్... తొలి మ్యాచ్ వీరి మధ్యేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఎప్పుడో...
25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుందన్న బీసీసీఐ వర్గాలు
ఇంటర్నెట్ డెస్క్: టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఎప్పుడో తెలిసిపోయింది. పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్లో మ్యాచ్ల ఫార్మాట్ తెలిసింది. షెడ్యూల్తోపాటు తొలి మ్యాచ్ ఎవరెవరి మధ్య జరగనుంది.. వేదిక ఎక్కడనేది మాత్రమే అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం గత సీజన్లో ఫైనల్కు చేరిన జట్ల మధ్యే ఈసారి మొదటి మ్యాచ్ ఉండనుంది.
మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 29న ముగియనుంది. కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం పది జట్లు 15వ సీజన్లో పాల్గొంటాయి. రెండు గ్రూప్లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఉంటాయి. గత సీజన్ ఫైనలిస్ట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్ ట్రోఫీని ధోనీ నాయకత్వంలోని సీఎస్కే గెలుచుకున్న విషయం తెలిసిందే.
‘‘అవును. సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ప్రారంభమవుతాయి. అన్ని జట్ల సభ్యులను తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. దీని వల్ల హోటల్ గది నుంచి స్టేడియం వరకు ఉండే ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలను తప్పించుకోవచ్చు. అలానే 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి