Michael Clarke: గర్ల్ఫ్రెండ్ చేతిలో ఆసీస్ మాజీ కెప్టెన్కు చెంప దెబ్బలు.. !
తనను మోసం చేస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్పై ఓ మహిళ చేయి చేసుకొన్న సంఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: తనను మోసం చేస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్పై ఓ మహిళ చేయి చేసుకొన్న సంఘటన చోటు చేసుకుంది. వేరేవారితో ఉంటూ మోసం చేస్తున్నట్లు ఆగ్రహించిన అతడి స్నేహితురాలు జేడ్ యార్బ్రో బహిరంగంగానే క్లార్క్ను చెంపదెబ్బలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జేడ్కు సర్ది చెప్పేందుకు క్లార్క్ ప్రయత్నించినా ఆమె ఏమాత్రం వినకుండా దాడి చేసింది. మాజీ ప్రేయసి పిప్ ఎడ్వర్డ్స్తో కలిసి మోసగించినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. శారీరక సంబంధం పెట్టుకున్నాడని విమర్శలు గుప్పించింది. ఆమెతో చేసిన చాటింగ్ను బయటపెట్టాలని డిమాండ్ చేసింది.
ఈ సంఘటనపై మైకెల్ క్లార్క్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘ఇలాంటి సంఘటన పట్ల ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను అత్యంత గౌరవ స్థానంలో ఉండేందుకు మీరంతా సహకారం అందించారు. మహిళలను ఆకర్షించుకొని ఇలాంటి పరిస్థితికి దిగజారినట్లు వచ్చిన ఆరోపణలు నన్ను మానసికంగా కుంగదీశాయి’’ అని క్లార్క్ వెల్లడించాడు.
బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందికరంగా ప్రవర్తించినందుకు మైకెల్ క్లార్క్, జేడ్ యార్బ్రోకు క్వీన్స్ల్యాండ్ పోలీసులు జరిమానా విధించినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. పబ్లిక్ న్యూసెన్స్ కింద ఫైన్ విధించామని, మరే ఇతర నేరం జరిగినట్లు తమ దర్యాప్తులో తేలలేదని సదరు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం బీసీసీఐ కామెంటేటరీ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న క్లార్క్ను తొలగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే నెలలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు, వన్డే సిరీస్లు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!