IND vs SA: తిరువనంతపురంలో టీమ్‌ఇండియాపై పూల వర్షం

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. కేరళ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ మైదానం వేదికగా భారత్‌, సౌతాఫ్రికా జట్లు........

Published : 27 Sep 2022 19:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. కేరళ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ మైదానం వేదికగా భారత్‌, సౌతాఫ్రికా జట్లు బుధవారం మొదటి మ్యాచ్‌ను ఆడనున్నాయి. దీంతో భారత జట్టు సోమవారం తిరువనంతపురానికి చేరుకోగా అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. అభిమానుల హోరు మధ్య వారు హోటల్‌కు చేరుకున్నారు. కాగా జట్టు సభ్యులపై హోటల్‌ సిబ్బంది పూల వర్షం కురిపిస్తూ వారికి స్వాగతం పలకడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ఇదిలా ఉంటే.. సఫారీ జట్టు ఆదివారమే అక్కడకు చేరుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించింది. రోహిత్‌ సేన మంగళవారం నుంచి కసరత్తులు మొదలుపెట్టనుంది. ఈ రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ అక్టోబర్‌ 2న గువాహటిలో, మూడో మ్యాచ్‌ అక్టోబర్‌ 4న ఇండోర్‌లో జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని