T20 World Cup: పాక్పై గేమ్ ‘A’ అమలు చేస్తామంటున్న విరాట్ కోహ్లీ
ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ సమరం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం తలపడబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచకప్ పోటీల్లో పైచేయి సాధించిన టీమిండియా తన ఆధిపత్యం కొనసాగిస్తుందా? లేదా పాక్ పుంజుకుని రికార్డును తిరగరాస్తుందా అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నలు. ఈ క్రమంలో భారత్, పాక్ సారథులు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ ఈ మ్యాచ్ను తేలిగ్గా తీసుకోరనేది కాదనలేని సత్యం. పాకిస్థాన్ జట్టులో ఆటను తమవైపు మలుపు తిప్పేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి పాక్ మీద గెలిచి గ్రూప్లో ముందంజ వేయాలంటే టీమిండియా అత్యుత్తమ గేమ్ను ఆడాల్సిందేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఆటగాళ్లతో ప్రి-మ్యాచ్ కాన్ఫరెన్స్లోనూ భారత సారథి విరాట్ కోహ్లీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘పాక్ బలమైన జట్టు. కాబట్టి వారితో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఉత్తమ ఆటతీరును ప్రదర్శించండి. పాక్ టీంలో గేమ్ ఛేంజర్లు చాలామంది ఉన్నారు. అందుకే పాక్తో అత్యుత్తమ ‘ఏ’ గేమ్ను ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పేర్కొన్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్య ఫిట్నెస్పై టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తుది జట్టులో చోటు దక్కడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ పాండ్య పరిస్థితిపై కోహ్లీ స్పందిస్తూ.. ‘‘హార్దిక్ ఫిట్నెస్ గాడినపడుతోంది. బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నాడు. అలాగే మా బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్పై చర్చించాం. అయితే ఆ వివరాలు ఇప్పుడే చెప్పకూడదు. మైదానంలో తమ ఆలోచనలను సరిగ్గా అమలుపరుస్తామనే నమ్మకంగా ఉన్నాం. కనీసం రెండు ఓవర్లపాటు బౌలింగ్ చేసేందుకు హార్దిక్ సిద్ధమయ్యే వరకు వేచి చూస్తాం. అప్పటి వరకు మాకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి’’ అని కోహ్లీ తెలిపాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్.. ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వంలో టీమిండియా ప్రపంచకప్ను నెగ్గాలని ప్రతి అభిమానీ ఆకాంక్షిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.