IPL 2022: దీపక్ కోసం సీఎస్కేతో సహా అన్ని జట్లూ పోటీపడతాయి
రాబోయే మెగా వేలంలో పేస్ బౌలర్ దీపక్ చాహర్ను కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్తో సహా అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని టీమ్ఇండియా...
ఇంటర్నెట్డెస్క్: రాబోయే మెగా వేలంలో పేస్ బౌలర్ దీపక్ చాహర్ను కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్తో సహా అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చాహర్ 2018లో తొలిసారి సీఎస్కేకు ఎంపికవ్వగా అప్పటి నుంచి ఆ జట్టులో కీలక బౌలర్గా రాణించాడు. నాలుగు సీజన్లలో మొత్తం 63 మ్యాచ్లు ఆడిన ఈ పేస్ బౌలర్.. 58 వికెట్లు పడగొట్టి కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయినా, ఈసారి చెన్నై టీమ్ అతడిని అట్టిపెట్టుకోలేదు. చెన్నై జట్టులో ధోనీ, జడేజా, రుతురాజ్తో పాటు మొయిన్ అలీని తమ వద్దే ఉంచుకుంది. దీంతో చాహర్ వేలంలో పాల్గొనక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే చోప్రా మాట్లాడుతూ చాహర్ను తీసుకొనేందుకు అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడతాయని అంచనా వేశాడు.
‘దీపక్ చాహర్ కొత్త బంతితో రెగ్యులర్గా వికెట్లు పడగొడతాడు. అతడిలా మరే భారత బౌలర్ కూడా అంత నిలకడగా వికెట్లు తీయలేడు. తొలి మూడు ఓవర్లలో అతడే కీలక బౌలర్గా నిలుస్తాడు. పవర్ప్లేలో బౌలింగ్ చేసి పలు వికెట్లు తీస్తాడు. ప్రత్యర్థుల వెన్నువిరుస్తాడు. అయితే, అతడు డెత్ ఓవర్లలో అత్యంత స్పెషలిస్టు అని చెప్పలేం కానీ.. అందుకు తగ్గట్లు ప్రయత్నిస్తాడు. దీంతో ఈసారి వేలంలో చెన్నై కూడా అతడిని తీసుకొనేందుకు ఆసక్తి చూపుతుంది. అలాగే అన్ని జట్లూ చాహర్పై కన్నేస్తాయి. ఇటీవల అతడు బ్యాటింగ్లోనూ పరుగులు చేస్తున్నాడు. దీంతో కచ్చితంగా మంచి ధర పలికే అవకాశమే ఉంది’ అని చోప్రా పేర్కొన్నాడు. కాగా, ఇటీవల చాహర్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో అర్ధ శతకం సాధించగా గతేడాది శ్రీలంక పర్యటనలోనూ ఒక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాడిగా మేటిగా రాణిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.