నట్టూ ఒక్కడే మనసులు గెలిచాడు
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో నటరాజన్ ఒక్కడే మనసులు గెలిచాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో...
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో నటరాజన్ ఒక్కడే మనసులు గెలిచాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చారు. ఆదిలోనే నటరాజన్ డీఆర్కీ షార్ట్(9)ను ఔట్ చేసినా.. వేడ్(58; 32 బంతుల్లో 10x4, 1x6), స్టీవ్స్మిత్(46; 38 బంతుల్లో 3x4, 2x6) రెచ్చిపోయి ఆడారు. అనంతరం మాక్స్వెల్(22), హెన్రిక్స్(26), స్టాయినిస్ (16), డానియల్ సామ్స్(8) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడారు. ఈ క్రమంలోనే ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 48, వాషింగ్టన్ సుందర్ 35, శార్దూల్ ఠాకుర్ 39, చాహల్ 51 పరుగులివ్వగా నటరాజన్ 20 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం చోప్రా తన ఫేస్బుక్లో మాట్లాడుతూ నట్టూని పొగడ్తలతో ముంచెత్తాడు.
‘ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ టీమ్ఇండియా బౌలింగ్పై విరుచుకుపడ్డారు. షార్ట్ త్వరగా ఔటైనా మాథ్యూవేడ్ బౌలర్లందరినీ చితకొట్టాడు. శార్దుల్, దీపక్, వాషింగ్టన్తో పాటు చివరికి చాహల్ను కూడా ఉతికారేశాడు. ఈ స్పిన్ బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులిచ్చాడు. అయితే, నటరాజన్ ఒక్కడే అందరి మనుసులు గెలుచుకున్నాడు. అతడికిది రెండో టీ20, మూడో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే. నాలుగు స్పెల్స్లో ఒక్కొక్క ఓవర్ ఇచ్చినా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లంతా ఈ మ్యాచ్లో అతడి ప్రదర్శనను చూసి చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు. ఈ మ్యాచ్లో నటరాజనే అతి పెద్ద సానుకూలాంశం. అతడు చాలా బాగా బంతులేస్తున్నాడు’ అని చోప్రా మెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి..
ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర..
కాసిన్ని కవ్వింపులుంటే బాగుండు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు