IPL 2022: ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్ కోసం పోటీ ఉంటుంది.. కానీ..!
రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ కోసం పోటీ ఉంటుంది కానీ, సారథిగా ఏ జట్టూ తీసుకోదని మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్డెస్క్: రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ కోసం పోటీ ఉంటుందని మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నారు. అయితే.. సారథిగా ఏ జట్టూ అతడిని తీసుకోదని అభిప్రాయపడ్డాడు. వార్నర్ గతేడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేయగా.. సన్రైజర్స్ యాజమాన్యం తొలుత కెప్టెన్సీ నుంచి.. ఆపై తుది జట్టు నుంచి కూడా పక్కకుపెట్టి ఘోరంగా అవమానించింది. ఈ క్రమంలోనే 2022 సీజన్కు సంబంధించిన రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలోనూ వార్నర్ పేరును ప్రస్తావించలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొంటాడని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే, ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ను కెప్టెన్గా తీసుకోడానికి పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఉన్నాయనే భావన క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన చోప్రా ‘వార్నర్ను కెప్టెన్గా తీసుకోడానికి పలు ఫ్రాంఛైజీలు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ.. నా అభిప్రాయం ప్రకారం ఎవరూ అతడిని సారథిగా ఎంపిక చేసుకోరు. ఇప్పటికే మూడు జట్లు కొత్త సారథిని నియమించుకోవాలని చూస్తున్నా.. అతడిని మాత్రం పరిగణనలోకి తీసుకోరు. అతడు ఈసారి కొత్త జట్టుకు వెళ్లడం ఖాయమే. భారీ ధర కూడా పలుకుతాడు. కానీ, కెప్టెన్సీ పరంగా అవకాశం లేదు. ఎందుకంటే ఐపీఎల్ ఒక కుటుంబం లాంటిది. గతేడాది ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అక్కడ ఆటగాళ్లు, ఫ్రాంఛైజీల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయంలోనూ అవగాహన ఉంటుంది’ అని తన అభిప్రాయాలు వెల్లడించాడు.
కాగా, వార్నర్ గతేడాది ఐపీఎల్లో మొత్తం 8 మ్యాచ్లు ఆడగా 195 పరుగులే చేశాడు. అందులోనూ దుబాయ్లో జరిగిన రెండో దశ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలోనే గత ఆరు సీజన్లలో గతేడాదే వార్నర్ 500 కన్నా తక్కువ పరుగులు చేశాడు. ఇక ఆ టోర్నీ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్లో ఆసీస్ కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లోనూ ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా వేలంలో అతడు ఏ జట్టుకు ఎంపికవుతాడో చూడాలి. అయితే, ఈ ఆసీస్ బ్యాట్స్మన్ వచ్చే సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా నియమితుడయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్