INDvsSL: అలా చేస్తే ధావన్, ద్రవిడ్కు తలనొప్పే!
వచ్చేనెలలో టీమ్ఇండియా శ్రీలంక పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ రెండు రోజుల క్రితం 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు స్పిన్ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం...
ఇంటర్నెట్డెస్క్: వచ్చే నెలలో టీమ్ఇండియా శ్రీలంక పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ రెండు రోజుల క్రితం 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు స్పిన్ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం. జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుండగా.. 21, 23, 25 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా మ్యాచ్ల్లో ఆరుగురు స్పిన్నర్లను ఎలా ఆడిస్తారని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సందేహం వెలిబుచ్చాడు. అది కెప్టెన్ శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రవిడ్కు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్నాడు.
‘ఈ పర్యటనలో ఆరుగురు స్పిన్నర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇందులో స్పిన్నర్లను ఎవరు ఎంపిక చేస్తారు? వీరిలో ఎవరిని.. ఎప్పుడు.. ఎలా ఆడించాలనే విషయాలపై కెప్టెన్, కోచ్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రాహుల్ చాహర్, యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ను తీసుకున్నారు. అయితే, ముగ్గురు స్పిన్నర్ల కన్నా ఎక్కువ ఏ మ్యాచ్లోనూ ఆడించే అవకాశం ఉండదు. కొన్నిసార్లు ముగ్గురు స్పిన్నర్లను ఆడించడం కూడా కష్టమవుతుంది. సహజంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. ఇక ఇందులో కృనాల్ పాండ్య కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడి తర్వాత ఫినిషర్లు లేరు. దాంతో మరో ఇద్దరు స్పిన్నర్లకే అవకాశం ఉంటుంది’ అని మాజీ క్రికెటర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
అలాగే యుజువేంద్ర చాహల్ను వన్డేల్లో కచ్చితంగా ఆడిస్తారని, దాంతో ఆ సిరీస్లో గరిష్టంగా ఇంకో స్పిన్నర్కు మాత్రమే అవకాశం ఉంటుందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక్కడ రెండో స్పిన్నర్గా కుల్దీప్కు అవకాశమివ్వాలని చెప్పాడు. ఎందుకంటే అతడిని టీ20ల్లో ఆడించే అవకాశం లేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్ను ఎందుకు ఎంపిక చేశారని మాజీ బ్యాట్స్మన్ సందేహం వెలిబుచ్చాడు. కాగా, టీమ్ఇండియా ఈ పర్యటనలో వివిధ స్పిన్ బౌలింగ్ జోడీలను ప్రయత్నించాలనే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాహల్, కుల్దీప్ను వన్డేల్లో.. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ను టీ20ల్లో ఆడించే అవకాశం ఉంది. కృనాల్కు తుది జట్టులో ఉండే అవకాశం ఉండటంతో కృష్ణప్పని అదనపు ఆటగాడిగా ఎంపిక చేశారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా