WTC Final: పుజారాకు 2.. బుమ్రా 3 మార్కులే
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసింది. టీమ్ఇండియా ఓటమి పాలైంది. అయితే మ్యాచులో ఆడిన విధానాన్ని బట్టి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆటగాళ్లకు రేటింగ్ ఇచ్చాడు. కీలకమైన వికెట్లు తీసిన మహ్మద్ షమికి 7 మార్కులిచ్చాడు. కెప్టెన్ కోహ్లీ, డిప్యూటీ కెప్టెన్ అజింక్య రహానెకు 5 మార్కులు..
ఆకాశ్ చోప్రా విశ్లేషణ
ముంబయి: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసింది. టీమ్ఇండియా ఓటమి పాలైంది. అయితే మ్యాచులో ఆడిన విధానాన్ని బట్టి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆటగాళ్లకు రేటింగ్ ఇచ్చాడు. కీలకమైన వికెట్లు తీసిన మహ్మద్ షమికి 7 మార్కులిచ్చాడు. కెప్టెన్ కోహ్లీ, డిప్యూటీ కెప్టెన్ అజింక్య రహానెకు 5 మార్కులు వేశాడు. అత్యల్పంగా చెతేశ్వర్ పుజారాకు 2 మార్కులే ఇవ్వడం గమనార్హం.
‘ఓపెనర్ రోహిత్ శర్మకు పదింటికి 6 మార్కులు వేస్తాను. రెండు ఇన్నింగ్సుల్లోనూ అతడు శుభారంభాలు ఇచ్చాడు. సగం నిండిన గ్లాసునే నేను చూస్తాను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కొత్త బంతిని ఎదుర్కోవడం కష్టం. తొలి ఇన్నింగ్స్లో అతడికి శుభ్మన్ గిల్ అండగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం త్వరగా ఔటయ్యాడు. అందుకే 4 మార్కులే’ అని ఆకాశ్ అన్నాడు.
‘చెతేశ్వర్ పుజారా నుంచి ఎక్కువే ఆశిస్తాం. అతడు రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమయ్యాడు. అందుకే 10కి 2 మార్కులే ఇస్తాను. కెప్టెన్ విరాట్ కోహ్లీ, డిప్యూటీ కెప్టెన్ అజింక్య రహానె తొలి ఇన్నింగ్సులో రాణించారు. కానీ రెండో ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేదు. అందుకే 5 మార్కులు ఇస్తున్నాను. పంత్ ఫర్వాలేదనిపించాడు. అతడికి 5 మార్కులు వేస్తాను. అయితే అతడు ఔటైన తీరు మాత్రం ఆశ్చర్యపరిచేదే’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్కు 6 మార్కులు వేసిన ఆకాశ్.. జడ్డూకు 3 మాత్రమే వేశాడు. పేస్ ద్వయం మహ్మద్ షమి, ఇషాంత్ శర్మకు ఎక్కువ రేటింగే ఇచ్చాడు. షమికి 7, ఇసాంత్కు 6 మార్కులు వేశాడు. వికెట్లు తీయలేకపోయిన బుమ్రాకు 3 మార్కులే వేశాడు.
ఎవరికి ఎన్నంటే..
రోహిత్ శర్మ (6/10)
శుభ్మన్ గిల్ (4/10)
చెతేశ్వర్ పుజారా (2/10)
విరాట్ కోహ్లీ (5/10)
అజింక్య రహానె (5/10)
రిషభ్ పంత్ (5/10)
రవీంద్ర జడేజా (3/10)
రవిచంద్రన్ అశ్విన్ (6/10)
ఇషాంత్ శర్మ (6/10)
మహ్మద్ షమి (7/10)
జస్ప్రీత్ బుమ్రా (3/10)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు