Virat Kohli: వరల్డ్ కప్ ముగిసిన తర్వాత.. విరాట్ ఇలా చెబుతాడేమో: ఏబీ డివిలియర్స్
ఇప్పుడందరి దృష్టి అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్పైనే (ODI World Cup 2023) ఉంది. ఒక్కసారి మెగా సమరం ముగిశాక కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు దూరమవుతారనే చర్చ కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్లో (ODI World Cup 2023) టీమ్ఇండియాకు విరాట్ కోహ్లీ కీలకం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే మంచి ఫామ్లో ఉన్న అతడు.. అదే ఊపును మెగాటోర్నీలో కొనసాగించి భారత్కు మరో ట్రోఫీని అందించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతాడనే వాదనా మరోవైపు ఉంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తు గురించి కోహ్లీ (Virat Kohli) ఎక్కువగా ఆలోచించడని.. ప్రస్తుతం అతడి దృష్టంతా వన్డే ప్రపంచకప్పైనే ఉందని వివరించాడు. అయితే.. టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే.. వన్డే ఫార్మాట్కు అతడు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాడు.
‘‘కోహ్లీ ప్రపంచకప్ 2027 కోసం దక్షిణాఫ్రికాకు (వరల్డ్ కప్కు వేదిక) రావడానికి ఇష్టపడతాడని తెలుసు. కానీ.. అలా జరుగుతుందని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే దానికి చాలా సమయం ఉంది. అయితే.. ఈ ప్రపంచకప్ భారత్ గెలిచిన తర్వాత విరాట్ ఇలా చెబుతాడని నేను అనుకుంటున్నా. ‘థ్యాంక్యూ వెరీ మచ్. నేను ఇక మీదట టెస్టు క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడతాను. కుటుంబానికి సమయం కేటాయిస్తాను. అందరికీ గుడ్బై’ అంటూ అతడు చెప్పొచ్చేమో. అయితే.. విరాట్ గొప్ప ఫిట్నెస్ను కొనసాగిస్తాడు. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటాడు. తగినంత విశ్రాంతి తీసుకుంటాడు.
బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!
అతడికి ఆటపట్ల ఉండే అభిరుచి, పరుగుల దాహం, కసి ఇప్పటికీ అలానే ఉందని నేను నమ్ముతా. విరాట్ దృష్టి ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులపై ఉండదు. అతడి ఉద్దేశం కూడా అది కాదు. తన జట్టు కోసం ప్రపంచకప్లు గెలవాలని కోరుకుంటాడు. అన్ని ఫార్మాట్లలో జట్టును విజయవంతంగా నిలబెట్టడంలో భాగమవుతాడు. అందుకే అతడు మైదానంలో ఉన్నప్పుడు అంతలా ఎమోషనల్గా కనిపిస్తాడు’’ అని ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించాడు.
ఇక సచిన్ నెలకొల్పిన శత శతకాల రికార్డును బద్దలు కొట్టే ఏకైక ఆటగాడు విరాటే అని విశ్లేషకులు చెబుతారు. అయితే, దానికి ఇంకా 23 సెంచరీల దూరంలోఉన్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 77 శతకాలు ఉన్నాయి. అయితే, సచిన్ వన్డేల్లో కొట్టిన 49 సెంచరీలకు విరాట్ సమీపంలోనే ఉన్నాడు. విరాట్ 47 శతకాలతో కొనసాగుతున్నాడు. బుధవారం ఆసీస్తో మూడో వన్డేతోపాటు వరల్డ్ కప్లో తప్పకుండా ఆ రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యాఖ్యానించాడు. -
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్
భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్కప్లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్ అత్యంత కీలకం కానుంది. -
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్గా ప్రకటించింది. -
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2024) భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
T20 WC 2024: టీ20 ప్రపంచకప్లో రోహితే సారథి!
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. -
INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. -
Pro Kabaddi League: విజృంభించిన సోను
రైడర్ సోను జగ్లాన్ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. -
junior hockey wc: అర్జీత్ హ్యాట్రిక్
జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పూల్-సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. -
భారత్కు మూడు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ (తజికిస్థాన్)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. -
Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమణ
విజయ్ హజారె ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమించాయి. పేలవ ప్రదర్శనతో గ్రూపు దశను దాటలేకపోయాయి. ఏడు మ్యాచ్ల్లో నాల్గింట్లో గెలిచి.. మూడింట్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూపు-బి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. -
Sports News: ఆ ఒక్క అథ్లెట్ డోపీనే
ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. -
IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్ పోటీ పడుతోంది’
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
-
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
-
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
-
Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్
-
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్