ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
ఇప్పుడంతా టీ20 లీగ్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 (SA T20) లీగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మిస్టర్ 360 ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పలు కీలక విషయాలపై మాట్లాడాడు. ఏబీడీ ఐపీఎల్లోనూ (IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఏబీ డివిలియర్స్ కేవలం దక్షిణాఫ్రికా ఆటగాడిగానే కాకుండా.. ఐపీఎల్లోనూ అదరగొట్టేయడంతో భారత అభిమానులకూ సుపరిచితుడు. మైదానం నలువైపులా క్రికెటింగ్ షాట్లను కొట్టే ఏబీడీని అంతా ‘మిస్టర్ 360’గా పిలుస్తారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏబీడీ గతేడాది లీగ్లకూ గుడ్బై చెప్పేశాడు. ఈ క్రమంలో క్రికెట్ షెడ్యూలింగ్కు సంబంధించి డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్లు రావడంతో ఆటగాళ్లు ఫార్మాట్లను ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు పలకడంపై ఎదురైన ప్రశ్నకు డివిలియర్స్ స్పందించాడు.
‘‘మంచి ఫామ్లో ఉన్న బెన్స్టోక్స్ అలా వన్డే ఫార్మాట్ను వదిలేయడానికి కూడా క్రికెట్ షెడ్యూలింగ్ కారణం అయి ఉంటుంది. విపరీతమైన బిజీ షెడ్యూల్తో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బంది పడతారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే సమస్య ఉంది. అయితే క్రికెటర్లను తమ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడేలా స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత ఆయా క్రికెట్ బోర్డులపై ఉంటుంది. అందుకే తొలుత ఆటగాళ్లతో మాట్లాడాలి. ఏం సాధించాలని అనుకుంటున్నారు..? వారు ఏ ఫార్మాట్కు సరిపోతారు..? అనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. మొదట దేశం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత లీగుల్లో ఆడటంపై ఏమాత్రం అభ్యంతరం ఉండదు. అయితే దీనికోసం బోర్డు, ఆటగాళ్లు పరస్పరం చర్చించుకోవాలి’’
‘‘విదేశాల్లో జరిగే లీగుల్లో ఆడితే వచ్చే అనుభవం మెగా టోర్నీల్లో సాయపడుతుంది. తనతోపాటు సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రెవిస్ వంటి క్రికెటర్లు రాణించారు. అదంతా లీగ్లతోనే సాధ్యమైంది. అందుకే మనం ఏం చేయగలమనేదానిపై దృష్టిపెట్టాలి. సదరు ప్లేయర్ ఓ ఫార్మాట్లో ఆడేందుకు ఇబ్బంది పడుతుంటే స్ఫూర్తి నింపాలి. అలాగే కొనసాగితే మాత్రం అతడితో చర్చించాల్సిన అవసరం ఉంది. నా కెరీర్లో నేను గమనించిన అంశమదే. తరచూ మాట్లాడుతూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో మద్దతుగా నిలిచింది’’ అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
Putin: గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు.. 24 ఏళ్లుగా అధికారంలోనే!
-
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
-
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
-
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
-
PM Modi: వారి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్
-
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్