AB de Villiers: ఐపీఎల్.. నాతోపాటు ఎంతోమంది ఆటగాళ్ల జీవితాలను మార్చేసింది: డివిలియర్స్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తనతో ఎంతో మంది జీవితాలను మార్చేసిందని దక్షిణాఫ్రికా, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఏబీ డివిలియర్స్ (AB de Villiers).. ఇండియా ఫ్యాన్స్ అభిమానించే అతి తక్కువమంది విదేశీ ఆటగాళ్లలో ఒకడు. ఈ మిస్టర్ 360 డిగ్రీల ఆటగాడు ఐపీఎల్ (IPL) లో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేసి అభిమానుల మనసు దోచుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో కొన్ని సీజన్లు దిల్లీ తరఫున ఆడిన డివిలియర్స్.. 2011 నుంచి గతేడాది రిటైర్మెంట్ ప్రకటించే వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడాడు. తాజాగా ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ లీగ్ తనతోపాటు ఎంతోమంది ఇతర క్రికెటర్ల జీవితాలను మార్చిందని పేర్కొన్నాడు. తన ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్గ్రాత్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నాడు.
‘ఇది (ఐపీఎల్ ప్రారంభం) నాతో పాటు ఎంతో మంది ఇతర ఆటగాళ్లకు గొప్ప సందర్భం. ఐపీఎల్ మా జీవితాలను మార్చింది. క్రికెట్పై ప్రజలు నిజంగా మక్కువ చూపుతున్నారు. స్వదేశీ జట్టుతోపాటు ఇతర జట్లలోని ప్లేయర్స్కి కూడా మద్దతు ఇస్తారు. నాకు ప్రత్యేకంగా కనిపించేది విషయం ఏంటంటే.. నేను కలుసుకున్న వ్యక్తులు. గ్లెన్ మెక్గ్రాత్తో కొంత సమయం గడిపాను. అప్పుడు అనుకోకుండా అతడి కలిసి డ్రెస్సింగ్ రూమ్లో బీర్ తాగా’ అని డివిలియర్స్ వెల్లడించాడు.
ఏబీ డివిలియర్స్, మెక్గ్రాత్ ఇద్దరూ ఐపీఎల్ మొదటి రెండు సీజన్లలో దిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడారు. ఐపీఎల్లో మొత్తం 184 మ్యాచ్లు ఆడిన డివిలియర్స్ 39.71 సగటు, 151.69 స్ట్రైక్రేట్తో 5,162 పరుగులు చేశాడు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 15 సీజన్లో ఆర్సీబీ కోచింగ్ బృందంలో చేరే అవకాశమున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై ఆర్సీబీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి