Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీది (Virat Kohli) ప్రత్యేక స్థానం. ఆటగాడిగా మైదానంలో దూకుడుగా ఉంటాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ.. ఇలా అత్యుత్తమం. ప్రస్తుతం విరాట్తో బాబర్ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) పోల్చదగిన ఆటగాడిగా ఇటీవల కాలంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) పేరు వినిపిస్తోంది. మ్యాచ్లపరంగా విరాట్ కంటే బాబర్ చాలా తక్కువే ఆడాడు. విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం తన అత్యుత్తమ ఫామ్తో ప్రపంచ క్రికెట్ను శాసించాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫామ్పరంగా కాస్త తగ్గినప్పటికీ ఫిట్నెస్లో మాత్రం విరాట్ను మించే ఆటగాడు లేడనేది కాదనలేని సత్యం. అయితే నిలకడైన ఆటతీరు, ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించడం వంటి అంశాల్లో విరాట్, బాబర్ సరిసమానులేనని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. మరి, వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం..? అనే విషయంపై మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. తాజాగా పాక్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. ఒక్క విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ దరికి కూడా బాబర్ చేరలేడని పేర్కొన్నాడు.
‘‘విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. జట్టును అద్భుతంగా నడిపించాడు. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉంటాడు. నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటాడు. విరాట్లో మరో అత్యుత్తమ విషయం ఫిట్నెస్. ప్రపంచస్థాయి ఫిట్నెస్ కలిగిన ఆటగాడు. ఇదే క్రమంలో విరాట్తో పోలిస్తే బాబర్ అజామ్ ఫిట్నెస్ చాలా పూర్గా ఉంటుంది. పాక్ నంబర్ వన్ ఆటగాడు బాబర్ అజామ్. అంతర్జాతీయంగా వన్డేల్లోనూ టాప్ ప్లేయర్. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడతాడు. విరాట్తో బాబర్ను పోల్చాల్సిన అవసరం లేదు. ఇదెలా ఉంటుందంటే.. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్లో ఎవరు బెటర్? అని అడిగినట్లు ఉంటుంది. కాబట్టి, విరాట్ కోహ్లీ భారత్ అత్యుత్తమ ఆటగాడు. బాబర్ పాక్కు చెందిన టాప్ ప్లేయర్. వీరిద్దరూ ప్రపంచస్థాయి ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఫిట్నెస్ విషయంలోనే వీరి మధ్య కాస్త తేడా ఉంటుంది’’ అని అబ్దుల్ రజాక్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి