PAK vs AFG: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్పై తొలి విజయం
టీ20 మ్యాచ్లో పాకిస్థాన్పై విజయం సాధించి అఫ్గానిస్థాన్ (Afghanistan) సంచలనం సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ (Afghanistan).. తనకన్నా బలమైన పాకిస్థాన్ (Pakistan)కు షాక్ ఇచ్చింది. ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో పాక్ని అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్పై అఫ్గానిస్థాన్కిదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకుండా బరిలోకి దిగిన పాక్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పాకిస్థాన్ను ఇమాద్ వసీమ్ (18) ఆదుకున్నాడు. లేకుంటే ఆ జట్టు టీ20ల్లో తన అత్యల్ప స్కోరు 74 (2012లో ఆస్ట్రేలియాపై) కంటే తక్కువకే ఆలౌటయ్యేది. లక్ష్యఛేదనలో 10 ఓవర్లకు 45/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న అఫ్గానిస్థాన్ను మహమ్మద్ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు.
‘‘పాక్పై మేం చాలాసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు ఆ జట్టుపై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మున్ముందు ఇదే జోరును కొనసాగించాలకుంటున్నాం. అఫ్గానిస్థాన్ తరఫున ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. షార్జాలో పిచ్ గురించి మాకు తెలియదు. ఇక్కడి పిచ్ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం టాప్ ఆర్డర్ను మెరుగుపర్చుకోవాలి’’ అని మ్యాచ్ అనంతరం అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.