Non - Striker Runout: ‘నాన్ స్ట్రైకర్’ రనౌట్పై చర్చ.. మరోసారి స్పష్టతనిచ్చిన ఎంసీసీ
నాన్ స్ట్రైకర్ రనౌట్ (Non Striker Run Out) వివాదం కొనసాగుతోనే ఉంది. దీంతో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కూడా స్పందించడం విశేషం. పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల గత టీ20 ప్రపంచకప్ నుంచి మొన్న శ్రీలంకతో టీమ్ఇండియా తొలి వన్డేలో మహమ్మద్ షమీ చేసిన ‘నాన్స్ట్రైకర్’ రనౌట్ వరకూ సోషల్ మీడియాలో, పలు క్రీడా ఛానెళ్లలో చర్చ కొనసాగుతోనే ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్ను భారత బౌలర్ దీప్తి శర్మ ఇలానే రనౌట్ చేయడంపై అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్బాష్ లీగ్లో ఆడమ్ జంపా కూడా ఇలాగే ప్రయత్నించి విఫలం కాగా.. లంక కెప్టెన్ను షమీ ఔట్ చేసినా భారత్ అప్పీలును వెనక్కి తీసుకొంది. గత అక్టోబర్ వరకు దీనిని మన్కడింగ్గా అభివర్ణించేవారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే వ్యాఖ్యలు వినిపించేవి. అయితే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అలాంటి ఔట్లను ‘నాన్ స్ట్రైకర్’ రనౌట్గా చట్టబద్ధం చేసింది. అయినా కూడా ఆందోళనలు, వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో ఎంసీసీ మరోసారి స్పష్టత ఇచ్చింది.
‘‘కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై ఆటగాళ్లు, అంపైర్లకు మంచి అవగాహనే ఉంది. అయినా సరే గందోరగోళానికి దారితీసే పదాలతో ఇబ్బంది పడుతున్నట్లు మేం గుర్తించాం.. దానిని అంగీకరించాం. దీంతో మెరుగైన స్పష్టత ఇవ్వడానికి 38.3 చట్టంలోని పదాలను మార్చడానికి నిర్ణయించాం. బౌలర్ తన చేతిని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లక ముందే నాన్స్ట్రైకర్ క్రీజ్ను దాటి ముందుకొచ్చినప్పుడు.. బౌలర్ వికెట్లను తాకిస్తే సదరు బ్యాటర్ రనౌట్గా పెవిలియన్కు చేరతాడు. ఇప్పటికే ఇలాంటి చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. తాజాగా ఆన్లైన్లో చేసిన మార్పు కూడా 19వ తేదీ నుంచే అమల్లోకి వచ్చేసింది’’ అని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు. బిగ్బాష్ లీగ్లో ఆడమ్ జంపా తన బౌలింగ్ యాక్షన్ను దాదాపు పూర్తి చేసిన తర్వాత నాన్స్ట్రైకర్ను ఔట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అంపైర్లు దానిని నాటౌట్గా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.