MS Dhoni : అతడి గురించి చింతించకండి.. ఎప్పుడూ నాతోనే ఉంటాడు : పతిరణ సోదరితో ధోనీ

చెన్నై యువ పేసర్‌ పతిరన(Pathirana) కుటుంబాన్ని ఆ జట్టు సారథి ధోనీ కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పతిరన సోదరి షేర్‌ చేసింది.

Published : 27 May 2023 02:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings).. ముంబయి రికార్డును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలో రోహిత్‌ సేన అత్యధికంగా ఐదు టైటిళ్లను గెలవగా.. ధోనీ సేన నాలుగు టైటిళ్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక చెన్నైతో ఫైనల్‌లో తలపడనున్న జట్టు నేటి క్వాలిఫయర్‌ 2లో తేలనుంది.

మరోవైపు ఫైనల్‌కు సిద్ధమవుతున్న ధోనీ(MS Dhoni).. తమ విజయాల్లో కీలక భాగస్వామిగా నిలిచిన యువ పేసర్‌ మథీషా పతిరణ(Pathirana) ఇంటికి వెళ్లాడు. వారి కుటుంబసభ్యులను చెన్నైలో ఆప్యాయంగా పలకరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అతడి సోదరి ఇన్‌స్టా వేదికగా పంచుకుని.. పతిరణ గురించి ధోనీ అన్న మాటలను షేర్‌ చేసింది. ‘‘మీరు మథీషా గురించి చింతించాల్సిన పని లేదు. అతడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు’ అని తలా మాతో చెప్పాడు. ఈ క్షణాలను నేను కలలో కూడా ఊహించలేదు. పతిరణ చాలా సురక్షితమైన హస్తాల్లో ఉన్నాడని మేం భావిస్తున్నాం’’ అని అతడి సోదరి విశూక తన పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది.

ఇక ఈ యువ మలింగ.. ధోనీ సారథ్యంలో రాటుదేలిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని