ajay jadeja: అందుకే అతడు పరుగుల రారాజు: జడేజా
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ పరుగుల రారాజు అని కొనియాడాడు.
దిల్లీ: మూడేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన తన అభిమానులకు ఆసియా కప్ ద్వారా టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఉపశమనం అందించాడు. ఆనాటి నుంచీ ఆటలో విజృంభిస్తూనే ఉన్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో తన బ్యాటింగ్తో చెలరేగిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ పరుగుల రారాజు అని కొనియాడాడు. అతడిలో ఉండే స్థిరత్వం ఎనలేనిదని కితాబిచ్చాడు.
‘‘ప్రపంచంలో పేరున్న క్రికెటర్లకు ఉన్న గొప్ప సామర్థ్యం విరాట్లో లేకపోవచ్చు. తనకన్నా గొప్పగా ఆడే వారు భారత జట్టులో ఉండివుండవచ్చు. కానీ అతడిలో ఉండే స్థిరత్వం మరెవరీలోనూ లేదు. గతంలో విరాట్ కోహ్లీ రన్స్ తీసి ఔటైతే ఎంఎస్ ధోనీ మిగిలిన ఆటను పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు అతడి చుట్టూ ఉన్న టీమ్ మారింది. దానివల్ల తనతో పాటు ప్రతిఒక్కరికీ కొత్త బంతులతో ఆడటం తేలికైంది. పటిష్టంగా నిలబడి మ్యాచ్ను గెలిపించగల దృఢమైన వ్యక్తి అతడు. పరుగుల వీరుడిగా తనకు దక్కిన గుర్తింపునకు కారణం కేవలం ఆడే సామర్థ్యం మాత్రమే కాదు. అంతకు మించి అతడో స్థిరమైన ఆటగాడు. భారత క్రికెట్కు కావలసింది కూడా అదే అని నేను ఆశిస్తాను. ఆటను ఎలా నడిపించాలో కోహ్లీకి తెలుసు’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆసీస్తో జరిగి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆడిన కోహ్లీ.. 48 బంతుల్లో 63 పరుగులు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని