గాయపడ్డా.. బౌలింగ్ ఒప్పుకొన్న కారణమదే!
కీలకమైన బ్రిస్బేన్ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్ఇండియా యువపేసర్ నవదీప్ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్ చేస్తానన్నాని...
దిల్లీ: కీలకమైన బ్రిస్బేన్ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్ఇండియా యువపేసర్ నవదీప్ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్ చేస్తానన్నాని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సైని ఆఖరి టెస్టులో గాయపడ్డ సంగతి తెలిసిందే.
‘గాయపడ్డా బౌలింగ్ చేయగలవా అని అజింక్య భాయ్ అడిగాడు. అందుకు నేను ఔననే జవాబిచ్చాను’ అని సైని అన్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం దక్కినా గాయపడటంతో బాధపడ్డానని అతడు వెల్లడించాడు. ‘నేను బాగున్నాను. కానీ హఠాత్తుగా గాయపడ్డాను. సుదీర్ఘకాలం తర్వాత అవకాశం దక్కింది. అందుకే అత్యంత కీలకమైన ఆటలో నాకే ఎందుకిలా అయిందని బాధపడ్డా. గాయపడ్డా జట్టుకు ఎలాగైనా సాయపడాలని కోరుకున్నా. ఎందుకంటే ఇలాంటి మ్యాచులు మళ్లీమళ్లీ రావని తెలుసు’ అని సైని అన్నాడు.
‘ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. త్వరలోనే ఫిట్నెస్ సాధిస్తా’ అని సైని తెలిపాడు. టెస్టుల్లో తీసిన నాలుగు వికెట్లలో మొదటి వికెట్ ఎంతో ప్రత్యేకమని అతడు పేర్కొన్నాడు. ‘అన్ని వికెట్లూ ప్రత్యేకమే. అయితే మొదటి వికెట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అదే జరిగేంత వరకు మనం మొదటి వికెట్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా’ అని అన్నాడు. బౌన్స్కు అనుకూలించే ఆసీస్ పిచ్లు ఊరించినా అన్ని బంతులు షార్ట్పిచ్లో వేయలేం కదా అని వెల్లడించాడు. ‘ఆస్ట్రేలియాలో రాణించాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. వారు చివరి వరకు వదిలి పెట్టరు. జట్టు యాజమాన్యం నాకెంతో మద్దుతుగా నిలిచింది. కెప్టెన్ రహానె, రోహిత్ భయ్యా నాకు అండగా నిలిచారు. రంజీ తరహాలోనే బంతులు వేయాలని సూచించారు’ అని సైని పేర్కొన్నాడు.
హైదరాబాదీ యువపేసర్ మహ్మద్ సిరాజ్ తనకు మంచి మిత్రుడని సైని అన్నాడు. తామిద్దరం చాన్నాళ్లు భారత్-ఏకు కలిసి ఆడామని వివరించాడు. ‘నా తొలి మ్యాచులో అతడు పూర్తిగా నాతోనే ఉన్నాడు. వేగం ముఖ్యమే అయినా లైన్ అండ్ లెంగ్త్ మీదా దృష్టి పెట్టాలని నాకు సూచించాడు. సిరాజ్ భిన్నమైన బౌలర్. తండ్రి మరణించినా ఆసీస్లోనే ఉండి సాహసం చేశాడు. అతడు సాధించిందంతా జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది’ అని పేర్కొన్నాడు. తన ఎదుగుదలలో టెన్నిస్ బంతి క్రికెట్ పాత్ర ఎంతో ఉందని సైని గుర్తు చేసుకున్నాడు. రంజీల్లోకి వచ్చాకే ప్రొఫెషనల్ క్రికెట్పై దృష్టి పెట్టానన్నాడు. అంతకు ముందు ఎలాంటి లక్ష్యం లేకుండా ఆడేవాడినని పేర్కొన్నాడు. రంజీ తర్వాతే ఒక్కో మెట్టు ఎదిగానని వెల్లడించాడు.
ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్ చెప్పలేదు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!