Ajinkya Rahane : ఫామ్లోకి వచ్చిన రహానె.. అరుదైన ఘనత సాధించిన యశ్ ధుల్
టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానె ఫామ్లోకి వచ్చాడు. సౌరాష్ట్ర, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో రహానె (108 నాటౌట్: 250 బంతుల్లో 14×4,2×6) శతకంతో సత్తా..
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానె ఫామ్లోకి వచ్చాడు. సౌరాష్ట్ర, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో రహానె (108 నాటౌట్: 250 బంతుల్లో 14×4,2×6) శతకంతో సత్తా చాటాడు. ముంబయి జట్టు తరఫున ఆడుతున్న రహానెకిది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 36వ శతకం. రహానె గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (121 నాటౌట్: 219 బంతుల్లో 15×4, 2×6) కూడా సెంచరీ నమోదు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి జట్టు 263/3 స్కోరుతో నిలిచింది. ముంబయి కెప్టెన్ పృథ్వీ షా (1), ఆకర్షిత్ గొమెల్ (8), సచిన్ యాదవ్ (19) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు.
* సచిన్ సరసన యశ్ ధుల్..
అండర్-19 జట్టు కెప్టెన్ యశ్ ధుల్ అరుదైన ఘనత సాధించాడు. రంజీ క్రికెట్లో అరంగేట్ర మ్యాచులోనే సెంచరీ నమోదు చేసి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన చేరాడు. తమిళనాడు, దిల్లీ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో.. యశ్ ధుల్ (113: 150 బంతుల్లో 18×4) శతకం నమోదు చేశాడు. ఇంతకు ముందు రోహిత్ శర్మ, పృథ్వీ షా, అమోల్ మజుందార్ తదితరులు రంజీ క్రికెట్లో అరంగేట్ర మ్యాచులోనే శతకాలు నమోదు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సరికి దిల్లీ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.
* మనీశ్ పాండే భారీ ఇన్నింగ్స్
కర్ణాటక, రైల్వేస్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచులో.. కెప్టెన్ మనీశ్ పాండే (156: 121 బంతుల్లో 12×4,10×10) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఆటగాడు కృష్ణమూర్తి సిద్ధార్ద్ (140 నాటౌట్: 221 బంతుల్లో 17×4,2×6) శతకంతో రాణించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి కర్ణాటక జట్టు 392/5 స్కోరుతో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.