WTC Final: చేతి వేలికి గాయం.. స్పందించిన అజింక్య రహానె!
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final) గెలవకపోయినా.. కనీసం డ్రాగా ముగిసినా ఆసీస్తో కలిసి సంయుక్త విజేతగా భారత్ నిలిచే అవకాశం ఉంది. అలా జరగాలంటే రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటర్లు గొప్పగా పోరాటం చేయాలి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్లో భారత్ భారీ లక్ష్య ఛేదనకు దిగడం ఖాయం. ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 123/4 స్కోరుతో కొనసాగుతోంది. దీంతో ఆధిక్యం 296 పరుగులకు చేరింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ క్రమంలో భారత్కు ఆసీస్ కనీసం 400కుపైగా పరుగులను లక్ష్యంగా నిర్దేశిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత బౌలర్లు విజృంభించి కట్టడి చేస్తే పరిస్థితి వేరేలా ఉండొచ్చు. దీంతో భారీ ఛేదనలో టాప్ ఆర్డర్తోపాటు మిడిలార్డర్ ఆడటం కీలకం.
తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించిన అజింక్య రహానె (89) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, మొదటి ఇన్నింగ్స్లో చేతి వేలికి గాయమైనప్పటికీ పోరాడాడు. మరి రెండో ఇన్నింగ్స్లో ఆడగలడా..? లేదా..? అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. తాజాగా దీనిపై రహానె స్పందించాడు. ‘‘నా చేతి వేలికి అయిన గాయం పెద్దదేమీ కాదు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్పై ప్రభావం చూపదని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించాడు.
గ్రీన్ అద్భుత క్యాచ్పై..
‘‘తొలి ఇన్నింగ్స్లో నా ఆటతీరుపై ఆనందంగా ఉంది. మేం కనీసం 320-330 పరుగులు చేస్తామని భావించాం. కానీ, అది సాధ్యపడలేదు. గ్రీన్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరక తప్పలేదు. అతడు మంచి ఫీల్డర్ అని తెలుసు. ఇప్పుడు ఆసీస్ ఆధిక్యంలోనే ఉంది. అయితే, మా రెండో ఇన్నింగ్స్లో ఒక్కో సెషన్ను ఆడుతూ ముందుకు సాగాలి. ఇవాళ తొలి గంట మాకు కీలకం. వారిని త్వరగా ఔట్ చేస్తే పట్టు సాధించేందుకు అవకాశం దొరుకుతుంది. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికీ సీమ్ బౌలర్లకు పిచ్ నుంచి సహకారం లభిస్తుంది’’ అని రహానె తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?