INDIA vs PAK: పాక్తో ముప్పు లేదన్న అగార్కర్.. పంత్పై పాక్ క్రికెటర్ కామెంట్స్
పాక్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న అజిత్ అగార్కరర్
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే. ఏ జట్టు గెలుస్తుంది? ఎవరు బాగా ఆడతారనే విషయాల మీద ఇరు దేశాల అభిమానులు, క్రీడాకారులు చర్చించుకుంటూనే ఉంటారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 24న పాక్తో టీమిండియా తలపడనుంది. భారత్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలో పాక్ను తక్కువ అంచనా వేయొద్దని భారత మాజీ పేసర్ అజిత్ అగర్కార్ టీమిండియాకు సూచించాడు. ‘క్లాస్ ఆఫ్ 2007’ కార్యక్రమంలో అగర్కార్ మాట్లాడుతూ.. ‘‘పాక్తో భారత్కు పెద్ద ముప్పేమీ ఉండకపోవచ్చు. అయితే దాయాది దేశాన్ని తక్కువ అంచనా వేయకూడదు. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగంతో కూడుకున్నది. అయితే ప్రతిసారీ టీమిండియానే పైచేయి సాధించింది. ఫామ్ను బట్టి చూస్తే ఇప్పుడు కూడా భారత్ జట్టుదే ఆధిక్యం ఉంటుంది. పాకిస్థాన్ సరైన సవాల్ను విసరకపోవచ్చు. అలా అని పొరుగు దేశం జట్టును తక్కువ అంచనా వేయకుండా నాణ్యమైన ఆటను ప్రదర్శించాలి’’అని సూచించారు. 2007 టీ20 ప్రపంచకప్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లమైన తాము ఆ రోజు కప్ను సాధిస్తామని ఎప్పుడూ అనుకోలేదన్నాడు.
పంత్.. కాస్త ఆలోచించి ఆడు: సల్మాన్ భట్
భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ కాస్త పరిణతితో ఆలోచించి ఆడాల్సిన అవసరం ఉందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘పంత్ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. అయితే పరిణతితో ఆడాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి పంత్ మూడ్ మారిపోతుంటుంది. భారీ షాట్లు ఆడేందుకు దూకుడుగా ముందుకు వస్తుంటాడు. మొదటి బంతి నుంచే ఇలా చేస్తుంటాడు. బౌలర్లకు దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి షాట్లు కొట్టాలి’’ అని సల్మాన్ భట్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు