All England Open 2022 : ‘ఆల్‌ ఇంగ్లాండ్‌’ నుంచి సింధు, సైనా ఔట్.. లక్ష్యసేన్‌ ముందుకు

భారత స్టార్‌ షట్లర్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో..

Published : 17 Mar 2022 22:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్టార్‌ షట్లర్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో చుక్కెదురైంది. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలవాలనే కోరిక తీరకుండానే మరోసారి పీవీ సింధు, సైనా రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు. జపాన్‌కు చెందిన సయక తకహషి 21-19, 16-21, 21-17 తేడాతో సింధుపై విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌ 2 ర్యాంకర్‌ యమగుచి చేతిలో 21-14, 17-21,21-17 తేడాతో సైనా ఓటమిపాలైంది. 

ఇక పురుషుల విభాగంలో షట్లర్‌ లక్ష్య సేన్ ముందడుగు వేశాడు. ప్రపంచ నెంబర్‌ 3 ర్యాంకర్‌ అండెర్స్ ఆంటోన్‌సెన్‌పై 21-16, 26-18తో వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం జర్మనీ జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. తెలుగు క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ తన రెండో రౌండ్‌లో ఆంథోనీ గింటింగ్‌తో తలపడుతున్నాడు. ప్రస్తుతం 21-9తో శ్రీకాంత్‌ తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని