Rayudu X Jackson: సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ.. వైరల్‌గా మారిన రాయుడు-జాక్సన్‌ వాగ్వాదం

 సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా షెల్డన్‌ జాక్సన్‌, రాయుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బరోడా తరఫున అంబటి రాయుడు ఆడుతుండగా.. షెల్డన్‌ జాక్సన్‌ సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Published : 13 Oct 2022 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సీనియర్‌ క్రికెటర్ అంబటి రాయుడుది మైదానంలో దూకుడుగా ఉండే స్వభావం. అయితే ఆ దూకుడే రాయుడుకు కొన్నిసార్లు చేటు తెచ్చేలా చేస్తుంది. తాజాగా సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా షెల్డన్‌ జాక్సన్‌, రాయుడు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బరోడా తరఫున అంబటి రాయుడు ఆడుతుండగా.. షెల్డన్‌ జాక్సన్‌ సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. షెల్డన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో రాయుడు ఏదో చెబుతుండగా.. వారి మధ్య చిన్నపాటి వాదులాట చోటుచేసుకుంది. అయితే అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యంచేసుకొని వారికి సర్దిచెప్పారు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని