Saba karim: రోహిత్, ధావన్కు అతడు ప్రత్యామ్నాయం: సాబా కరీం
కేఎల్ రాహుల్ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్కు ప్రత్యామ్నాయంగా భావిస్తానని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సాబా కరీం అన్నాడు.
దిల్లీ: రానున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సన్నద్ధతను మొదలుపెట్టింది. ఈ టోర్నమెంట్ ముంగిట న్యూజిలాండ్తో టీ20 ఫలితం నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ 4న బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సాబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్కు ప్రత్యామ్నాయంగా భావిస్తానని తెలిపాడు.
‘‘కేఎల్ రాహుల్ను నేను శిఖర్ ధావన్, రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయ ఓపెనర్గా చూస్తాను. రాహుల్ క్లాస్ ఆటగాడు. ఓపెనర్గా అతడు బాగా ఆడాడు. ఫామ్ అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోడు. కానీ, అతడు ఏ స్థానంలో బ్యాటింగ్కి దిగుతాడో తెలియదు. ఒకవేళ ఓపెనర్ స్థానం కాకపోతే మిడిలార్డర్లో ఆడిస్తాం. కానీ, ఆ స్థానాన్ని ఎంతకాలం పొడిగించగలం? ఇప్పటికే దానికి చాలా పోటీ ఉంది. ప్రస్తుతం జట్టులో నెలకొన్న సందిగ్ధత ఇదే. కెప్టెన్, మేనేజ్మెంట్ కలిసి వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం చూపాలి’’ అని తెలిపాడు.
కొత్త ఆటగాళ్లు రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠికి జట్టులో అవకాశం కల్పించడంపై మాట్లాడుతూ.. ‘‘జట్టులో వీరిద్దరూ ప్రతిభావంతులు. భారత టీ20 లీగ్, దేశీయ క్రికెట్లో ఇప్పటికే నిరూపించుకున్నారు. వైట్ బాల్ క్రికెట్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని నేను ఇంతకుముందే సూచించాను. ఆటగాళ్ల సామర్థ్యాలను ముందుగానే లెక్కించకుండా ఇలాంటి యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తే బాగుంటుంది. కొత్తగా ప్రయత్నించాలనుకునే క్రికెటర్లకు ఇది చాలా మంచి సమయం. ఈ విషయంలో ముందుగా సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్తో కలిసి ప్రణాళికలు తయారుచేయాలి’’ అని సాబా కరీం వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.