T20 world cup: మెగా టోర్నీలో భారత జట్టుదే పైచేయి!
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ల కోలాహలం కూడా మొదలై పోయింది. ఈ క్రికెట్ పండుగలో తుది వరకు నిలిచేది ఎవరు? కప్పు ఎగరేసుకుని పోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ అభిమానుల చూపంతా ఇటే. టీ20 కెప్టెన్గా ఇదే చివరి టోర్నీ అన్న కింగ్ కొహ్లీ... మెగా టోర్నీలు
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ల కోలాహలం కూడా మొదలై పోయింది. ఈ క్రికెట్ పండుగలో తుది వరకు నిలిచేది ఎవరు? కప్పు ఎగరేసుకుపోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ అభిమానుల చర్చ మొత్తం దీని చుట్టే. టీ20 కెప్టెన్గా ఇదే చివరి టోర్నీ అన్న కింగ్ కోహ్లీ... మెగా టోర్నీలు గెలవలేడన్న విమర్శలను బ్రేక్ చేస్తాడా? యూఏఈలో ఐపీఎల్ హంగామాకు కొనసాగింపుగా వస్తున్న టీ-20 వరల్డ్కప్లో భారత్ గెలుపునకున్న బలాలేంటి? సుదీర్ఘ విరామం తర్వాత తలపడుతున్న చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాక్ మ్యాచ్పై విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం..
ఇప్పటికే యూఈఏలో ఐపీఎల్ అడుతున్న భారత ఆటగాళ్లకు అక్కడి పిచ్లను ఆకళింపు చేసుకునే ఉంటారు. పైగా 2007లో టీ20 ప్రపంచకప్ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ మెంటార్గా ఉండటం భారత జట్టుకు గొప్ప వరం.. బలం. ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్న విరాట్ కోహ్లీకి ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి కచ్చితంగా టీ20 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందన్న నమ్మకముంది.
ఆటగాళ్లు చాలా ఫిట్గా ఉన్నారు..
ఐపీఎల్ పూర్తయిన వెంటనే ఐసీసీ టోర్నీ ఆడితే ఆటగాళ్లపై భారం పడుతుందనే కొందరి వాదన కరెక్ట్ కాదు. ఫిట్నెస్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ప్రస్తుతం ఏ సమయంలో ఏ ఫార్మాట్లలో ఆడేందుకైనా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు. ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచేందుకు, ఇప్పటికే యూఈఏలో ఆడిన అనుభవం ఉండటంతో ఐసీసీ మ్యాచ్లను ఎలా ఆడాలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయడానికి భారత్కు మంచి టీం ఉంది. పిచ్ స్వభావాన్ని బట్టి పేస్ బౌలర్లు రాణించగలిగితే మ్యాచ్ల్లో విజయం సాధించడం ఖాయం!
ధోనీ సూచనలు.. సలహాలు చాలా ముఖ్యం..
యువ క్రికెటర్లకు మెంటర్గా సలహాలు, సూచనలు ఇవ్వడంలో, జట్టు వ్యూహాల్లో మెంటర్గా ధోనీ సేవలు జట్టుకు అదనపు బలం కానున్నాయి. ప్రత్యర్థి భారీ స్కోరు చేసి సవాల్ విసిరినా.. మన జట్టు కాస్త బలహీనపడినా ఆటగాళ్లలో ధోనీ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి వెనకుండి నడిపించగలడు. జట్టు వ్యూహ రచనల్లోనూ కీలకంగా వ్యవహరిస్తాడు.
స్పిన్నర్స్ దళం గట్టిదే.. కానీ..!
మొదటి నుంచి భారత్ జట్టులో స్పినర్స్ దళం బలోపేతంగానే ఉంది. అయితే.. పిచ్ స్వభావం, డ్యూ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి మ్యాచ్ రోజు వ్యూహరచనలో బరిలోకి స్పిన్నర్లను దింపాలా? మీడియం/స్లో పేస్ను దింపాలా అనేది నిర్ణయించాలి. భారత జట్టుకు విజయం చేకూర్చడంలో విరాట్ కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రి కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. అలాగే.. పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్ శైలిని మార్చడంలో భారత జట్టు మేనేజ్మెంట్ దిట్ట.
- రాజశేఖర్, కోచ్.. ఎల్బీ స్టేడియం
కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదన్న మచ్చ ఉంది. అయితే, ఇది అతనికి చివరి ప్రయత్నంగా భావించొచ్చు. కోహ్లీ టీ20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. ఇక ఎం.ఎస్.ధోనీ మెంటర్గా ఉండటంతో జట్టు కూర్పులో సహాయసహకారాలు అందుతాయి. కాబట్టి.. టీ20 ప్రపంచకప్ గెలవడంలో భారత్కు మంచి అవకాశాలున్నాయి.
శార్దూల్ ఠాకూర్ ఎంపిక సరైందే..
యూఏఈలో పిచ్లు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ పిచ్లపై స్పిన్నర్స్, మీడియం పేసర్స్ ముఖ్యపాత్ర పోషిస్తారు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి ఎంపిక చేయడం మంచి పరిణామం. ధోనీ, కోహ్లీ గతంలో ఎన్నో మ్యాచ్లు కలిసి ఆడారు. ఇప్పుడు వారిద్దరూ కెప్టెన్, మెంటర్ వ్యవహరిస్తుండటం ఒక ఛాలెంజ్గా ఉంటుంది.
పాకిస్థాన్పై భారత్దే పైచేయి..
భారత్, పాక్ మ్యాచ్ ఒక అద్భుతమైన ఆటగా ఉండబోతుంది. ఐసీసీ మ్యాచ్లో పాకిస్థాన్పై ఎక్కువగా భారత జట్టే విజయాలు సాధించింది. ఇతర దేశాల కంటే భారత ఆటగాళ్ల ఫిట్నెస్ చాలా బాగుంది. ఐపీఎల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. అలుపెరుగకుండా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది మనకు సానుకూలాంశం. పాకిస్థాన్తో మ్యాచ్ కోసం ఆటగాళ్లతోసహా అందరూ ఎదురుచూస్తున్నారు.
టీ20లో అన్ని జట్లు ఒక్కటే..
టీ20 ఫార్మాట్లో అన్ని జట్లు సమానమే. తనదైన రోజున ఏ జట్టు అయినా విజయం సాధించగలదు. అయితే, భారత్కు అన్ని విధాలుగా ఆలోచించే తెలివైన కోచ్లు ఉన్నారు. భరత్ అరుణ్, రవిశాస్త్రి, శ్రీధర్తోపాటు ఇప్పుడు జట్టులో మెంటర్గా ధోనీ చేరాడు. కాబట్టి.. అన్ని దేశాలకంటే భారత్దే మేటి జట్టుగా చెప్పొచ్చు. అయితే, భారత్కు దీటుగా పోటీ ఇచ్చేవి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లే.
ఓపెనర్లుగా వీళ్లే..
భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్రాహుల్.. మూడో బ్యాటర్గా విరాట్ కోహ్లీ రావొచ్చు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ది మంచి జోడీ. ఒకవేళ రైట్హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కోణంలో చూస్తే ఇషాంత్ కిషన్ను ఓపెనర్గా తీసుకొచ్చే అవకాశముంది. వికెట్ కీపర్తో కలిపి ఆరుగురు బ్యాటర్లను, ఒక ఆల్రౌండర్సహా ఐదుగురు బౌలర్లతో మ్యాచ్ రోజు పరిస్థితులను బట్టి జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తుదిజట్టు బ్యాటర్ల ఎంపికలో భారత్కు చాలా ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్ కాంబినేషన్ను సెట్ చేయడంలో, పిచ్ పరిస్థితులను విశ్లేషించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషిస్తారు.
- జాన్ మనోజ్, మాజీ క్రికెటర్, హెచ్సీఏ ఉపాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ