Anushka Sharma: అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులు
‘‘అనుష్క శర్మ: 88 బంతుల్లో 52 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్స్)’’. అదేంటీ.. బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ క్రికెట్ ఆడారా..?
ఇంటర్నెట్డెస్క్: ‘‘అనుష్క శర్మ: 88 బంతుల్లో 52 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్స్)’’. అదేంటీ.. బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ క్రికెట్ ఆడారా..? అందులోనూ అర్ధశతకం చేసేశారా..?ఎక్కడ ఆడారు.. సినిమాలోనా.. నిజంగానా.. ఈ వార్త చూడగానే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు కదూ..! మీరే కాదండి.. బీసీసీఐ ఈ ట్వీట్ చేసినప్పటి నుంచి యావత్ క్రికెట్ ప్రియుల పరిస్థితి ఇదే. అయితే ఇందులో బీసీసీఐ పేర్కొన్న అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ సతీమణి కాదు. భారత మహిళల అండర్ 19 క్రికెటర్. అసలేం జరిగిందంటే..
మహిళల అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2021-22 టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. ఇందులో దేశవాళీ మహిళా క్రికెటర్లను టీమ్ ఏ, బీ, సీ, డీ ఇలా నాలుగు జట్లుగా విభజిస్తారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. నవంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. ఇందులో ‘టీమ్ బి’ జట్టు కెప్టెన్ పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. నిన్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. బీసీసీఐ విమెన్(bcci women) ట్విటర్ ఖాతాలో ఓ అప్డేట్ ఇచ్చారు. అందులో ‘అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు’ అని రాసి ఉంది.
దీంతో ఈ ట్వీట్ కాస్తా నెటిజన్లను ఆశ్చర్యానికి, గందరగోళానికి గురిచేసింది. అనుష్క పేరు చూడగానే విరాట్ సతీమణి అనే అంతా అనుకున్నారు. అంతేనా.. కోహ్లీని విమర్శించేందుకు బీసీసీఐ ఇలా చేసిందేమో అని పొరబడ్డారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారడంతో నెటిజన్లు కోహ్లీని ఉద్దేశిస్తూ ఫన్నీ పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు. ‘‘అనుష్క మ్యాచ్ ఆడేందుకు వెళ్లిందని ఎందుకు చెప్పలేదు. అక్కడ వామికా ఏడుస్తోంది’’ అని కోహ్లీ అంటున్నట్లుగా మీమ్స్ తయారుచేశారు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అనుష్క శర్మపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కుటుంబానికి ఆన్లైన్లో బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో దిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!