Arjun Tendulkar: ఆ విషయంలో సచిన్ను అధిగమించిన అర్జున్
సచిన్(Sachin Tendulkar), అతడి తనయుడు అర్జున్ తెందూల్కర్(Arjun Tendulkar) బౌలింగ్ గణాంకాల్లో ఓ పోలిక ఉంది. అంతే కాదు.. ఐపీఎల్లో సచిన్ చేయలేని పనిని అర్జున్ చేసి చూపించాడు.
ఇంటర్నెట్డెస్క్ : సన్రైజర్స్ హైదరాబాద్(SRH)తో మ్యాచ్ను సచిన్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ తెందూల్కర్(Arjun Tendulkar) ఎప్పటికీ మరిచిపోలేడు. ఎందుకంటే ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఐపీఎల్(IPL) కెరీర్లో తొలి వికెట్ సాధించాడు ఈ యువ పేసర్. అర్జున్ వికెట్ సాధించిన సమయంలో ముంబయి(mumbai indians) డ్రెస్సింగ్ రూమ్లోనే సచిన్ సంబరాలు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తొలి వికెట్పై అర్జున్ స్పందించాడు.
దానిపైనే దృష్టిపెట్టాను..
‘ఐపీఎల్లో నా తొలి వికెట్ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయడంపై దృష్టి పెట్టాను. బంతిని కాస్త దూరంగా సంధించి.. లాంగ్ బౌండరీల కోసం ప్రయత్నించేలా బ్యాట్స్మెన్ను కవ్వించాలన్నది మా ప్రణాళిక. ఇక బౌలింగ్ వేయడాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తాను. కెప్టెన్ ఏ సమయంలో బౌలింగ్ చేయమన్నా.. సిద్ధంగా ఉంటాను. జట్టు ప్రణాళికలకు కట్టబడి.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని అర్జున్ వివరించాడు.
క్రికెట్ గురించి తన తండ్రి సచిన్తో ఎప్పుడూ చర్చిస్తుంటానని అర్జున్ వెల్లడించాడు. ‘మేం క్రికెట్ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఆటకు ముందు వ్యూహాల గురించి చర్చించుకుంటాం. ప్రాక్టీస్లో ఏదైతే చేస్తావో.. ప్రతి మ్యాచ్లో అదే ఆటతీరును కొనసాగించాలని ఆయన సూచించారు. బంతి రిలీజ్పైనే నేను దృష్టి పెడతాను. మంచి లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేస్తాను’ అంటూ ఈ యువ పేసర్ పేర్కొన్నాడు.
సచిన్ vs అర్జున్..
ఇక అర్జున్ తీసిన తొలి వికెట్ అతడికి ఎంత గొప్పదో.. అతడి తండ్రి సచిన్ బౌలింగ్ గణాంకాలను పోల్చితే తెలుస్తుంది. ఎందుకంటే సచిన్ ఐపీఎల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు మరి. 2009వ సీజన్లో సచిన్ ఆరు ఓవర్లు వేసినప్పటికీ.. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ విషయంలో ఇప్పుడు సచిన్ను అతడి తనయుడు అధిగమించడం విశేషం. ఈ తండ్రీకుమారుల మధ్య మరో పోలిక ఉందండోయ్. 2009లో కోల్కతాపై ముంబయి తరఫున తొలిసారిగా బౌలింగ్ చేసిన సచిన్ మొదటి ఓవర్లో 5 పరుగులే ఇచ్చాడు. ఇటీవల అదే కోల్కతాపై జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన అర్జున్.. తొలి ఓవర్లో ఐదు పరుగులే ఇవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!