Ranji trophy: తండ్రి బాటలో తనయుడు.. రంజీ అరంగేట్ర మ్యాచ్లోనే అర్జున్ తెందూల్కర్ సెంచరీ
మాస్టర్ బ్లాస్టర్ తనయుడు అర్జున్ తెందూల్కర్(Arjun tendulkar) తండ్రి రికార్డును సమం చేశాడు. 1988 నాటి మ్యాచ్ను గుర్తుచేస్తూ తొలి శతకాన్ని అందుకున్నాడు.
పనాజీ: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ (arjun tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ(Ranji trophy)లో భాగంగా బుధవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఈ యువ ఆటగాడు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ నైట్ వాచ్మెన్గా బ్యాటింగ్కు దిగి శతకం బాదేశాడు. దీంతో గోవా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. గతంలో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. 1988 రంజీ ట్రోఫీలోకి కేవలం 15 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్(Sachin tendulkar) మొదటి సెంచరీని నమోదు చేశాడు.
నైట్వాచ్మన్గా వచ్చి..
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి రోజు ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అర్జున్ 15 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. రెండో రోజు మాత్రం తన సత్తా ఏమిటో చూపుతూ విజృంభించాడు. 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 120 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. మరో బ్యాటర్ సుయాంశ్ ప్రభుదేశాయ్ (212*)తో కలిసి అర్జున్ గోవా ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో గోవా జట్టు రెండో రోజు ఆట ముగిసేసమయానికి 493/8 భారీ స్కోరు చేసింది.
ముంబయి నుంచి గోవాకి..
2018 శ్రీలంక పర్యటనలో భాగంగా అండర్-19 క్రికెట్లో అరంగేట్రం చేసిన అర్జున్.. ప్రపంచకప్ జట్టులో మాత్రం ఆడలేకపోయాడు. భారత టీ20 లీగ్లో ముంబయి ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన తర్వాత ఒక్క మ్యాచ్లో సైతం ఆడలేకపోయాడు. ఈ విషయంపై హెడ్ కోచ్ మహేల జయవర్దనె స్పందిస్తూ ఆటపరంగా అతడింకా కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఇటీవల ఆ జట్టు నుంచి ఎన్వోసీ పొంది ప్రస్తుతం గోవా జట్టులోకి మారిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై దాడి చేసిన చిరుతతో పోరాడిన పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్