Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
యువ క్రికెటర్లు అర్ష్దీప్ సింగ్ (Arshdeep singh), ఇషాన్ కిషన్ (Ishan kishan) వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జట్టులో సుస్థిర స్థానం కోసం కష్డపడుతున్నారు. తప్పకుండా వీరద్దరూ మంచి స్టార్లుగా ఎదుగుతారని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ భవిష్యత్తు తారలుగా యువ క్రికెటర్లు అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్ మారతారని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తెలిపాడు. వీరిద్దరూ ఎదుగుతున్న తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఐపీఎల్లోని పంజాబ్ కింగ్స్ తరఫున అర్ష్దీప్ ఆడుతున్న విషయం తెలిసిందే. అనిల్ కుంబ్లే గత సీజన్ వరకు పంజాబ్ జట్టుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో అత్యంత తక్కువ వ్యవధిలోనే అర్ష్దీప్ కీలక పేసర్గా మారడం అద్భుతమని కుంబ్లే అన్నాడు. గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లో అర్ష్దీప్ కీలక బౌలర్గా మారాడు. ‘‘అర్ష్దీప్తో కలిసి పని చేశా. టీమ్ఇండియా కోసం అతడు ఎదుగుతున్న తీరు అద్భుతం. రాబోయే కాలంలో భారత బౌలింగ్ సూపర్ స్టార్గా మారతాడు’’ అని కుంబ్లే తెలిపాడు. గత జులైలో టీ20 అరంగేట్రం చేసిన అర్ష్దీప్ 25 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు. కేవలం మూడు వన్డేలను మాత్రమే ఆడిన అర్ష్దీప్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.
యువ ఆటగాడు ఇషాన్ కిషన్ నైపుణ్యమున్నబ్యాటర్ అని, భవిష్యత్తులో తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళ్తాడని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ‘‘బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ సూపర్బ్. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడు కూడా భవిష్యత్ సూపర్ స్టార్గా ఎదుగుతాడు’’ అని వెల్లడించాడు. అయితే కుంబ్లే అభిప్రాయానికి భిన్నంగా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మరో ఇద్దరిని ఎంపిక చేసుకొన్నాడు. ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ వైపు మొగ్గు చూపాడు. తిలక్ వర్మ నాయకుడిగా మారే సత్తా ఉందని తెలిపాడు.
‘‘ఉమ్రాన్ బౌలింగ్ చాలా వేగంగా ఉంటుంది. ఇప్పటికే భారత్ తరఫున ఆడుతున్నాడు. అతడు కూడా సూపర్ స్టార్గా మారతాడు. బ్యాటింగ్లో తిలక్ వర్మకే నా ఓటు. గత కొన్నేళ్లుగా అతడి ఆటతీరును పరిశీలించండి. కేవలం బ్యాటింగ్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. భవిష్యత్తులో జట్టును నడిపించగల సత్తా కూడా అతడిలో ఉంది’’ అని పటేల్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.