వారిద్దరూ సమన్వయం చేసుకొని ఆడాలి:ఓజా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌తో పాటు తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో అవకాశం దక్కితే ఇద్దరూ సమన్వయం చేసుకుని ఆడాలని భారత మాజీ  స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సూచించాడు.  అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి

Published : 12 May 2021 00:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌తో పాటు తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో అవకాశం దక్కితే ఇద్దరూ సమన్వయం చేసుకుని ఆడాలని భారత మాజీ  స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సూచించాడు.  అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి వికెట్‌మీదనైనా వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టి జట్టుకు విజయాలనందించగలరని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో కొన్నాళ్లుగా ఈ స్పిన్ ద్వయం ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నాడు.
 

‘రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరు ఆడాలి. ఇద్దరూ బ్యాటింగ్ చేయడంతోపాటు ఎలాంటి పిచ్‌లమీదనైనా మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తారు. జడేజాకు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. అతడు మూడు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. అశ్విన్‌ కూడా పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో శతకాలు బాదాడు. ఈ ఇద్దరి స్పిన్నర్లకు తుది జట్టులో ఆడే అవకాశం వస్తే సమన్వయం చేసుకుని ఆడాలి. అనుభవజ్ఞులైన వీరిద్దరూ ఎలాంటి  వికెట్‌మీదనైనా విజయాలను అందించగల సమర్థులు’ అని ఓజా అన్నాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని