ఇంటికి చేరుకున్న అశ్విన్, సుందర్
టీమ్ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ శుక్రవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిన వీరు అక్కడ..
చెన్నై: టీమ్ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ శుక్రవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఐపీఎల్ తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లిన వీరు అక్కడ టెస్టు సిరీస్లో విశేషంగా రాణించారు. మూడు టెస్టుల్లో 12 వికెట్లు తీసిన సీనియర్ స్పిన్నర్.. సిడ్నీ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హనుమ విహారి (21*)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యం జోడించిన అశ్విన్(39*) చివరి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. భరించలేని వెన్ను నొప్పితో సతమతమౌతున్నా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసి భారత్ ఓటమి నుంచి తప్పించుకుంది.
ఇక చివరిదైన గబ్బా టెస్టులో అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆధిక్యం 33 పరుగులకు తగ్గించడంలో కీలకంగా వ్యవహరించాడు. శార్దూల్ ఠాకుర్ (66)తో కలిసి సుందర్ (62) ఏడో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. దాంతో టీమ్ఇండియా నాలుగో టెస్టులో మళ్లీ పోటీలోకి వచ్చింది. లేదంటే మ్యాచ్ చేజారిపోయేది. ఈ క్రమంలోనే భారత జట్టుతో కలిసి గురువారం ఉదయం దుబాయ్కు చేరుకున్న అశ్విన్, సుందర్ నేరుగా చెన్నైకి రాలేకపోయారు. దుబాయ్లో వేచి చూసి శుక్రవారం ఉదయం తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అశ్విన్, సుందర్ మరో ఆరు రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాతే బయటకు వెళ్లాలి. ఇక ఆస్ట్రేలియాపై రాణించిన ఈ ఇద్దరు స్పిన్నర్లు.. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే 4 టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు ఎంపికయ్యారు. మరోవైపు హెడ్ కోచ్ రవిశాస్త్రి, అజింక్య రహానె, రోహిత్, శార్దూల్ ఠాకుర్, పృథ్వీషా గురువారం ముంబయి చేరుకోగా.. రిషభ్ పంత్ దిల్లీ, నటరాజన్ బెంగళూరు, సిరాజ్ హైదరాబాద్ విమానాశ్రయాల్లో దిగారు. వారంతా అక్కడి నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు.
ఇవీ చదవండి..
ఆటగాళ్లకు క్వారంటైన్ నిబంధనల్లో సడలింపు
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)