IND vs AUS: పంత్ లేని లోటు శ్రేయస్ తీరుస్తాడు: అశ్విన్
భారత టెస్టు జట్టులో రిషభ్పంత్ లేని లోటు శ్రేయస్ అయ్యర్ తీరుస్తాడని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు జట్టులో రిషభ్పంత్ లేని లోటు శ్రేయస్ అయ్యర్ తీరుస్తాడని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. గత ఏడాది బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శ్రేయస్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్లో 422 పరుగులు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రెండో భారీ స్కోరు అతడిదే. మొదటి స్థానంలో రిషభ్పంత్ (680) ఉన్నాడు. గతేడాది వన్డేల్లో 724 పరుగులు సాధించి 2022 సంవత్సరానికి ఐసీసీ ఉత్తమ వన్డే జట్టు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి పంత్ అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో గతేడాది సిరీస్లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ తప్పకుండా పంత్లేని లోటును భర్తీ చేస్తాడని అశ్విన్ పేర్కొన్నాడు.
‘‘గత రెండేళ్ల నుంచి రిషభ్పంత్తో పాటు శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులో ఆడుతున్నాడు. అప్పటి నుంచి అతడు జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. టెస్టుల్లో శ్రేయస్ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పడం నిజంగా అతడిని తక్కువగా పొగడడమే అవుతుంది. భారత బ్యాటింగ్ ఆర్డర్కి అతడు వెన్నుముక లాంటివాడు. పంత్ లేని లోటును అతడు కచ్చితంగా తీరుస్తాడు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ తుది జట్టులో శ్రేయస్కు స్థానం దక్కడం అనుమానమే. కొంతకాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న శ్రేయస్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కి దూరంగా ఉన్నాడు. ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో మళ్లీ ప్రాక్టీసు మొదలుపెట్టాడు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప