Ashwin :ఆ ఇద్దరు బ్యాటర్లతో పోటీ పడటం ఇష్టం: అశ్విన్
టీ20 లీగ్లో ఆ ఇద్దరు బ్యాటర్లను ఎదుర్కోవడం చాలా ఇష్టమని..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో ఇద్దరు బ్యాటర్లను ఎదుర్కోవడం చాలా ఇష్టమని టీమ్ఇండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. టీ20 లీగ్ వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం యువ క్రికెటర్లకు వచ్చిందన్నాడు. ప్రస్తుత సీజన్లో అశ్విన్ రాజస్థాన్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ‘‘నిజం చెప్పాలంటే టీ20 లీగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎదుర్కోవడం చాలా ఇష్టం. వారిద్దరూ నాణ్యమైన బ్యాటర్లు. అంతర్జాతీయ క్రికెట్లో వారితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా. దేశవాళీ టీ20 లీగ్లో మాత్రం ప్రత్యర్థిగా బరిలోకి దిగా. అందుకే ఆ ఇద్దరితో పోటీ పడటం నాకెంతో నచ్చింది. అంతేకాకుండా వారిద్దరూ బౌలర్లకు లొంగేందుకు ఇష్టపడరు. అందుకే కోహ్లీ, రోహిత్తో పోటీ అంటే ఇష్టపడతా’’ అని అశ్విన్ వివరించాడు. టీ20 లీగ్లో భాగంగా ముంబయి, రాజస్థాన్ జట్ల మధ్య శనివారం (ఏప్రిల్ 2) మ్యాచ్ జరగనుంది.
సూర్యకుమార్ వచ్చేస్తున్నాడు!
రాజస్థాన్తో మ్యాచ్కు ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చేస్తున్నాడు. దీంతో ముంబయి మిడిలార్డర్ బలోపేతం అవుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. హైదరాబాద్ మీద భారీ విజయంతో రాజస్థాన్ హుషారుగా ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్లో దిల్లీ చేతిలో ముంబయి ఓటమి చవిచూసింది. ఓపెనింగ్ బాగున్నా.. మిడిలార్డర్లో పరుగులు చేయడంలో ముంబయి విఫలం కావడంతో భారీ స్కోరు చేసే అవకాశం చేజారింది. బౌలింగ్లోనూ బుమ్రా (3.2-0-43) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుర్రాళ్లు బసిల్ థంపి (3/35), మురుగన్ అశ్విన్ (2/14) మాత్రమే రాణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి