మేం గెలవడానికి కారణం టిమ్పైనే..
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమ్ఇండియా 2-1 తేడాతో గెలుపొందడానికి ఆ జట్టు కెప్టెన్ టిమ్పైనే కారణమని రవిచంద్రన్ అశ్విన్ మరోసారి సెటైర్లు వేశాడు...
ఆసీస్ కెప్టెన్పై మరోసారి అశ్విన్ సెటైర్లు
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల టెస్టు సిరీస్లో టీమ్ఇండియా ఘన విజయానికి ఆసీస్ కెప్టెన్ టిమ్పైన్ కూడా ఓ కారణమని రవిచంద్రన్ అశ్విన్ మరోసారి సెటైర్లు వేశాడు. సిడ్నీ టెస్టులో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ‘గబ్బాకు రా చూసుకుందాం’ అని పైన్ అంటే.. ‘నువ్వు ఇండియాకు వస్తే అదే నీ ఆఖరి సిరీస్’ అంటూ అశ్విన్ సైతం సవాల్ చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేయాల్సింది కాదన్నాడు.
అశ్విన్ తాజాగా టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్తో ముచ్చటించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా మరోసారి టిమ్పైన్పై అశ్విన్ ఛలోక్తులు విసిరాడు. గబ్బా టెస్టులో అతడు చేసిన తప్పిదాలతో భారత్ గెలిచిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ‘రెండో ఇన్నింగ్స్లో పంత్(89*)ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని పైన్ వదిలేశాడు. దాంతో నేనతడిని ఇష్టపడటం మొదలెట్టాను. మమ్మల్ని గబ్బాకు రమ్మని పిలిచాడు.. తీరా వెళితే అక్కడ స్టంపింగ్ చేసే అవకాశాన్ని వదిలేశాడు. అలా అతడే మాకు సిరీస్ను కట్టబెట్టాడు. 2-1 తేడాతో మేం గెలుపొందడానికి కృషి చేశాడని చెప్పను కానీ, మరోలా చెప్పాలంటే అదే చేశాడు’ అని అశ్విన్ సరదాగా వివరించాడు.
కాగా, మూడో టెస్టులో అశ్విన్(39*), హనుమ విహారి(23*)తో కలిసి ఓటమి వైపు వెళ్తున్న మ్యాచ్ను డ్రాగా ముగించాడు. ఒకవైపు విపరీతమైన వెన్నునొప్పి బాధిస్తున్నా అశ్విన్ ఎంతో నిబద్ధతతో ఆడాడు. వీరిద్దరూ 259 బంతులు ఎదుర్కొని చివరి వరకూ క్రీజులో పాతుకుపోయారు. తాము ఔటైతే టెయిలెండర్ల వికెట్లు పడతాయనే ఉద్దేశంతో మ్యాచ్ను డ్రా దిశగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టును డ్రా చేయడంతో అశ్విన్పై ప్రశంసల జల్లు కురిశాయి. ఆరోజే పైన్ స్లెడ్జింగ్ చేయడంతో దీటుగా బదులిచ్చాడు.
ఇవీ చదవండి..
ద్రవిడ్ సలహాలు పాటిస్తే మేలు : పీటర్సన్
‘301’ క్యాప్.. వెలకట్టలేని సంపద
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!